పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణంబుభంగి నప్రయాసంబునం దపంబు సలుపుచున్న కాళరాత్ర్యభిధానయు
సంహారకారిణియు నగురుద్రశక్తిం గని దగదొట్టినయెలుంగులతోడ నోజగన్మాత
ధాతవరంబునం క్రొవ్వి రురుం డనుదానవుండు మమ్ము సమరంబునం బరాజితులం
జేసి వాఁడె వెన్నాడి వచ్చుచున్నాఁడు వానిబారిం బడకుఁడ రక్షింపు మని మొఱ
పెట్టిన నద్దేవి పెద్దయెలుంగున వెఱవకుండు వెఱవకుం డని పలుకుచు నట్టహాసంబు
చేసినం దదాననగహ్వరంబున.

122


క.

ఉఱిమెడుకాదంబినిలోఁ, గఱకుఁబిడుగుగములు వెడలుగతిఁ గైదువు ల
న్మెఱుఁగులతో నుదయించిరి, జొఱజొఱ మిడుగుఱులు రాలుచూపులశక్తుల్.

123


ఉ.

వార లసంఖ్యకోటు లనివారితవిక్రమలీల వాలి పా
ధోరుహగర్భసర్గము వధూమయ మయ్యె ననంగ నిండి దే
వారిచమూసమూహముల నాజి బడల్పడఁ గొట్టి నెత్తురుల్
వారలు వట్టి రప్పుడు బలక్షయ మైన రురుండు దెంపునన్.

124


క.

హరిహయముఖసురసేనా, పరివృత మగురుద్రశక్తిపరివారముపై
సరభసరౌరవమాయా, కరసమ్మోహనమహాశుగం బేయుటయున్.

125


సీ.

సవ్యాపసవ్యముల్ శరము లేయుట మాని నెఱఁకులు విఱుగంగ నిలుగువారు
చటులతరాట్టహాసములు చేయుట మాని బెట్టుగా గుఱుకలు పెట్టువారు
శత్రులఁ దలయూఁచి జంకించుటలు మాని కూర్కుపాటులఁ దూఁగి కూలువారు
సింహనాదంబులు చెలఁగి చేయుట మాని ముంచుతంద్రల నావలించువారు
నై మహేంద్రాదిసురలు దైత్యాధినాథ, మాయ జోకొట్టె నన నిద్రవోయి కలవ
రింతు రిదె వచ్చె రురుఁ డని కొంతతడవు, కొంతదడ వాదమఱచి నిద్రింతు రపుడు.

126


మ.

కఠినక్ష్వేళలతోడ రౌద్రి జయశంఖం బొత్తినన్ జన్యభూ
లుఠదింద్రాదికదేవతాపరివృఢుల్ మోహవ్యపేతాత్మతన్
హఠసంప్రాప్తవివేకులై జయజయవ్యాహారముల్ సల్పఁగా
శఠు నద్దానవుఁ జంపె శాంభవి భుజస్తంభత్రిశూలంబునన్.

127


క.

ఆవేళ రౌద్రిశూలము, త్రావినదైతేయశోణితము ఘన మైనం
దా వాంతి చేసెనో యనఁ, గా విగళద్రక్తయుతముఖంబుల నొప్పెన్.

128


గీ.

రురునిచర్మంబు ముండంబు సరభసముగ, రెండుగాఁ జేసి రౌద్రి చాముండి యనెడు
నామధేయంబు వహియించె నాఁడు మొదలు, సకలమంత్రాగమౌఘప్రశస్తముగను.

129


సీ.

అప్పుడు దైత్యరణాయాసఖిన్నలై శాంభవిఁ బరివారశక్తు లెల్ల
నాఁకలి దీ మా కాహార మిడు మన్న మానసంబున వగ గాన లక్ష