పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈశ్వరకథితము లనియు న, నశ్వరవేదానువర్తనము లనియు వృథా
విశ్వాసవిమోహితులై, శశ్వత్కర్మములు మిగుల జరపరు సుమ్మీ.

20


వ.

ఏఁ గల్పించిన మతంబులలోపలం బాశుపతంబు వేదసమ్మతంబు గావున సకలలోక
సమ్మతంబు వేదం బన మత్స్వరూపంబు తద్వేదబాహ్యులు న న్నెఱుంగ లేరు
నాకు విష్ణునకు బ్రహ్మకు భేదంబు లేదు మేము మువ్వురమును గుణత్రయంబును వేద
త్రయంబును వహ్నిత్రయంబును లోకత్రయంబును శక్తిత్రయంబును సంధ్యాత్రయం
బును వర్ణత్రయంబును మొదలుగాఁ ద్రిధాబంధం బగు సచరాచరంబురూపున
వర్తింపుదుము గౌణముఖ్యపక్షంబుల మమ్ము నొక్కటిగా నెఱిఁగి సోహంభావం
బున భజించుసుజనుండు విష్ణుభక్తుండు ముక్తుండు ననం బరఁగు నని యేతద్రహ
స్యం బాన తిచ్చిన రుద్రునకుఁ బ్రాచీనబహిర్ముఖబహిర్ముఖులును సనత్కుమారాది
యోగీంద్రులును మఱియునుం దక్కినసభాసదులును నేనునుం బ్రణమిల్లి మధు
మథనమథితమధురజలధిసముల్లోలహల్లీసకనిభార్భటి నిర్భరఫణితిసందర్భంబునం
బ్రశంసించునవసరంబున.

21


వనమయూరము.

ఓంకృతిమహావనమయూర మగునాయే
ణాంకధరుమేనఁ జతురాననుఁడు నుద్య
త్పంకజహితాయుతసబాంధవరుచుల్ న
ల్వంక వెదచల్లుకమలావిభుఁడుఁ దోఁపన్.

22


శా.

ఆమాహాత్మ్యముఁ జూచి యాజకఋషుల్ సాశ్చర్యులై ఋగ్యజు
స్సామంబుల్ పఠియింపుచున్ జయజయోచ్చైర్నాదముల్ రోదసీ
సీమం బంతయు నిండఁగాఁ బొగడి యోశ్రీమన్మహాదేవ నీ
వీమూర్తిత్రితయంబు దాల్చినవిధం బేలా గెఱింగింపుమా.

23


గీ.

అనిన వారలఁ జూచి యీయజ్ఞవేళ, మీరు నా కిచ్చినహవిస్సు మేము మువ్వు
రమును బంచి పరిగ్రహింతుము మునీంద్రు, లార మాయైక్య మిదిమొద ల్గా నెఱుఁగుఁడు.

24


గీ.

అనిన వారు కృతార్థుల మైతి మనుచు, మ్రొక్కి దేవర చేసిన మోహశాస్త్ర
ములనిమిత్తంబునుఁ బ్రవర్తకులను లెస్స, తెలియ నానతి యిమ్మనఁ బలికె శివుఁడు.

25


సీ.

మున్ను భారతవర్షమున దండకావనవాటి గౌతమఋషివర్యుఁ డబ్జ
సంభవుఁ గూర్చి నిష్ణాపరత్వంబున బహుకాల ముగ్రతపంబు సలిపి
ప్రత్యక్ష మైనతద్బ్రహచే విత్తినసస్యంబు లన్నియు జాములోన
పరిపాకమును బొంద వరముఁ గైకొని వచ్చి శతశృంగగిరిఁ బర్ణశాలఁ గట్టు
కొని సమర్పించుఁ గోటులకొలఁది మీఱ, వచ్చునతిథుల కెల్ల నవ్వారి గాఁగ
షడ్రసాన్నంబు వరలబ్ధసస్యవృద్ధి, కలిమి నంతట నొకకొంతకాలమునకు.

26