రామాయణ విశేషములు
187
సీతకు, ప్రపంచము నింద లొడిగట్టుననియు రామునికి తెలియును. సీతచే అగ్నిపరీక్ష చేయించినప్పటి అతని నిగ్రహము అద్వితీయమైనది.
రాముడు మహావీరుడు. అతనికి సాటివారు లేకుండిరి. సత్య సంధుడు. జితేంద్రియుడు. ఈ కారణాలచేత అతడు దేవసముడయ్యెను.
లక్ష్మణుడు
ఇతడు ప్రీతిపాత్రుడు. రామునంతటి నిగ్రహుడుకాడు. ధర్మా గ్రహుడు. ఉత్తగా కోపించుకొనడు. మంచిదెల్లను అతనికి సన్నికర్షము. దుష్టమెల్లను అతని కసహ్యము. కోపము వచ్చెనా దానిని శాంతింప జేయువాడు రాముడొక్కడే. రామునిలోని ఉత్తమత్వము అతనికి చాలా ప్రియమైనట్టిది. అందుచేత అతనికి స్వయంసేవకు డయ్యెను. రాముని యౌవరాజ్య పట్టాభిషేకము భగ్నమైనప్పుడు, రాముని త్యాగమును మొదటిసారి చూచినప్పుడు అతడు కన్నీరు కార్చినాడు. ఎట్లో కోపము బిగబట్టినాడు. రామునివెంట నోరుమూసుకొని తిరిగినాడు. తుదకు రాముడున్నూ తల్లివద్ద ఏడ్చినప్పుడు లక్ష్మణుని క్రోధము బయట పడినది. కాలరుద్రుడైనాడు. చిన్న భార్యచే మోహితుడై పెద్దకొడుకును అడవికి పంపే తండ్రి తండ్రికాడని అన్నాడు. ఎవ్వరడ్డము వత్తురో చూచెదనుకాక, నేనొక్కడనే ధనుర్ధరుడనై ప్రపంచాన్ని ఎదిరించి రామునికి పట్టము కట్టుతానని హుంకరించినాడు. రాముడు ఆగు మాగుము, శాంతించుము అని బోధించినాడు. మదపుటేనుగునకు ఆ మాటలు సంకెళ్లైనవి. “మృదుర్హి పరిభూయతే” "మెత్తనగుచోటనే గుద్దలి వాడియౌకదా"! అని రాముని మెత్తదనాన్ని గర్హించినాడు. కర్మము ననుభవించవలెనందురా? దైవవిధి అనుల్లంఘనీయ మందురా?
"వీరా స్సంభావితాత్మానో నదైవం పర్యుపాసతే"
(అయో. 23–16)