పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

81


శ్శకలోత్తంసవధూటి న న్నొసఁగె నాశౌర్యక్రియాశాలికిన్
శుకమాత్రం బని నన్నుఁ జూడకు బుధస్తోమైకచింతామణీ.

123


మ.

అది యట్లుండఁగ నిమ్ము హేతిహతమత్తారాతి సత్కీర్తిపా
రదశోభాకరదోఃప్రతాపశిఖరారజ్యద్విచిత్రక్రమా
స్పదుఁ డావంచకనాథనందనుఁడు రక్షశ్శైలదంభోళి య
మ్మదిరాక్షీ మకరాంకమూర్తి గడు సమ్మానించు నన్నున్ నృపా.

124


మ.

కదనక్షోణి విశంకటాసుర వరగ్రామీణు దర్పంబు వా
ల్చి దదీయంబగు నాత్మదేశమున కక్షీణత్వరం బోవఁద్రో
వ దరశ్రాంతిఁ దదీయరథ్యములు నిల్పన్ నేటికి న్నిల్చినా
డదె నీకేళివనాంతసీమ నన రా జాశ్చర్యనిర్మగ్నుఁడై.

125


మ.

తన దేవేరి మొగంబు చూచి యిదె కాంతా కంటివే వింత లే
మని వర్ణింపఁగవచ్చు నిచ్చిలుక యాహా పుట్ట నిట్టాడు నే
మన మాశ్చర్యపయోనిధి న్మునిఁగె నీమాహాత్మ్య మేరీతిఁ గ
ల్గెనొ మున్నేమి తపంబు చేసెనొకొ యీకీరంబు పెంపెట్టిదో.

126


మ.

మనువంశాగ్రణి రాజశేఖరుఁ సామాన్యుండుగాఁ డిప్పుడేఁ
జని యచ్చోటికిఁ దోడి తేవలయు నీసౌజన్యధన్యాత్ము నీ
యనఘున్ గీరవరేణ్యు గాంతిమతి కిమ్మా వేడ్క సంధిల్ల నం
చు నృపాలుండు మృదంగభేరిపటహస్తోమాతిసన్నాహుఁడై.

127


గీ.

చని కనుంగొని యత్యంతవినయసంభ్ర
మంబు లుప్పొంగ నాలింగనం బొనర్చి
హేమధన్వ మహీపాలుఁ డేని యింత
వేఱు సేయఁడుగా మమ్ము వీరవర్య.

128


గీ.

ఇట్లు చేరువ కేతెంచి యిష్టబంధుఁ
డయిననుఁ జూచి పోవు నంతయును లేదె
యనుచు విహితానులాపంబు లాడు సింధు
కువలయాధీశు ప్రియముచేకొని యతండు.

129