పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

29


బృందలతాంతకాంతకబరీభరసౌరభసారసన్నిభ
న్మందరకందరాసవిధమంధరబంధురగంధవాహముల్.

45


క.

ఇందుమణి మందిరాంగణ
మందారమరందమత్తమధుకరనినదా
నందమునఁ బొంది నగరా
ణ్ణందనయుం దానుఁ బ్రమథనాథుఁడు మెలఁగున్.

46


సీ.

వామదేవుని మౌళి వాడని క్కొవ్విరి
                       బూజగావించిన పుణ్యుఁ డితఁడు
సకలామరశ్రేణి సంప్రీతిఁ బొందంగ
                       దానమిచ్చిన మహాధర్మి యితఁడు
తులసిఁ గల్పించి మర్త్యులఁ బావనంబుగఁ
                       జేసిన యుపకారజీవి యితఁడు
(దేవర్షులకుఁ గామధేనువుఁ గలిగించి
                       తలఁపు లీడేర్చిన ధన్యుఁ డితఁడు)


గీ.

పాఁపతరి ద్రాటఁ ద్రచ్చునిర్బంధమునకు
నోర్చి త్రిప్పట నొందినయుత్తముండు
ఇతఁడు సర్వప్రదానైకహేతు వనుట
గలశవార్ధికిఁ గల్పనాగౌరవంబు.

47


చ.

అని కొనియాడి యాముని విహారమనోహర మైన యీనగేం
ద్రునికడ నేఁడు నిల్త మతిదూరముగాఁ జనుదెంచి సేన డ
స్సిన యది దైత్యుటెంకియును జేరువ యిచ్చటి కర్కమండలం
బును దనుజప్రతాపగతిఁ బోల్పరి వారిధి గ్రుంకం బాఱెడున్.

48


వ.

అని పలుకు నమ్మునిపలుకులు విని యప్పుడమిఱేఁడు పడవాళ్ళం
బిలిచి సేనల విడియ నియోగించె నప్పుడు.

49


సీ.

గగనపాదోల్లేఖగంధసింధురఘటా
                       ఘంటాఘణాత్కారకఠినరవము