పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపులు రాక్షసులును గలసి యందంద, కృపణుండు దీనుండు కృశుఁడు లేకుండ
నాదట నొసఁగితి మర్ధులయం దింక, పేద యెవ్వఁడు లేఁడు పృథివిపై ననఁగ
నక్కడ మునివరుయాగముమహిమ, కక్కజం బందుచు నాత్మలో నలరి
వాసవడుయమసౌమవరుణాదిసురులు, చేసినమఖము వీక్షింప మీమొదల
మానుగా కలధౌతమణిసువర్ణాది, దానశోభితమయిన దశరథాత్మజుని
కత్రువుతో సరిబోల్పగాదుగా కనుచు, నతినిర్మలోక్తుల నగ్గింపుచుండ
నందంద వనచరుల్ యామినీచరుల, నం దన్నపానాదు లమర సేయించి
వదలక నడప సంవత్సరంబునకు, ముద మంది వాల్మీకిమునిపుంగవుండు

అశ్వమేధయాగము సేయుచున్న శ్రీరామునిచెంతకు వాల్మీకిమహర్షి శిష్యులతో వచ్చుట

బహుశిష్యగణములు బలిసి తన్ గొలువ, మహనీయమయిన యమ్మఖవాటమునకు
చనుదెంచినంత నాసంయమీంద్రునకు, మునిగణసహితుఁడై ముదమంది నృపుఁడు
మునిపూజ లొనరించి మునిగేహవాటి, వినుతింపఁదగుచోట విడియించె నంత
విశదాత్ముఁ డఖిలార్థవిదుఁడు వాల్మీకి, కుశలుఁడై కూర్పుండ కుశలవుల్ వచ్చి
వినతు లైనను వారి వేడ్క దీవించి, కనుగొని మీ రెప్డు గవవాయ కి౦దు
వనముల ఫలముల వ్రతనిష్ఠ గొనుచు, ..........................................
నగరివాకిట జననాయకుసభను, నొగి జతుష్పథముల నుద్యానములను
రాజితిగతి నొప్పు రచ్చల దేవ, రాజాలయంబుల రాజమార్గముల
యాగశాలల తాపసస్థానములను, రాగంబుతోడ నీరామాయణంబు
సరినొప్పునిరువదిసర్గలలెక్క, సరసంబుగాఁ గూడి చదువుఁ డెల్లెడల
మీ రెవ్వ రన్న వాల్మీకిసంయమికి, నారయ శిష్యుల మని జెప్పు డెలమి
నారదుచే వీణెనాదంబుఁ గలుగు, చారువీణాతంతి చక్కగా దిగిచి
చని రక్ష గావించు జననాయకుండు, జనకుండు గాన యీజనలోకపతికి
తప్పక వినిపింప దగవు విన్పింప, డొప్పుగా నెల్లిటనుండి మీ చదువు

కుశలవులు రామునిచెంత రామాయణము పాడుట

డని పల్క వారలు నారాత్రి వేగ, ఘననిష్ఠ దమనిత్యకర్మముల్ దీర్చి
మరునాఁడు మఖవాటమధ్యరంగమున, నెరయంగ మునులతో నెమ్మి గొల్వున్న
మనుజేంద్రుముందట మధురనాదముల, నొనగూడుకొని వీణె యొప్పుగా మ్రోయ