పుట:ముకుందవిలాసము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

క. అంగనలకు హరికినిఁ దన
    సంగీతము వినఁగఁజేసి చాన లిడు మణీ
    సంగతభూషలు గొని ది
    వ్యాంగద మచ్యుతుఁ డొసంగి యంఘ్రి ఘటింపన్.255

గీ. దానిఁ గైకొని యంత సౌందర్యదర్ప
    మేర్పడఁగ శౌరి పట్టపుటింతు లొక్క
    మాటనెపమున నెవ్వారు దీటు మాకు
    సుందరత నన్న వారి కా శుకము వలికె.256

క. కలుగుదు రొకతఱి తమకౌ
    తలఁ జక్కనివారు తాడుదన్నెడివారిం
    దలఁదన్నువారు లేరే
    వలదీ గర్వంబు లెంతవారలకైనన్.257

గీ. అనుచు నర్మోక్తిగాఁ బల్క నా శుకోక్తి
    వారు విస్మయపడియుండ వీరికన్న
    కన్య లావణ్య మెక్కుడౌగా యటంచు
    హరియు సన్నకు సన్నలో నెఱిగె నంత.258

వ. మఱియు నత్తఱి నా కీరసత్తమంబు తమ మత్తకాశినిం దలంచి
    పురుషోత్తమపదాయత్తంబగు చిత్తంబు మెత్తమెత్తన మఱలించి,
    యందరిచేత ననుజ్ఞాతంబై యా నందనందను నభినందింపుచుంజనియె
    నవ్విధంబున.259

ఉ. కీరము శౌరి వీడుకొని కేకయరాట్పురమార్గచారమై
     దూరము బోవ దాని వెను దూకొనుచూడ్కులు నెట్టకేలకుం