పుట:మత్స్యపురాణము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

41


క.

ఆ యనలము లోకంబులఁ
బాయక దహియించి యంతఁ బ్రభ యణఁగి మహా
వాయువునఁ గలయు నదియును
నా యెడ నాకాశలీన మగు మునివర్యా!

32


వ.

బ్రహ్మాండస్వరూపనాశకం బై తమస్సమావృతం బగు నిది యాత్యంతికప్ర
ళయంబు నాఁ బరఁడు. కొందఱు లయంబులు చతుర్విధలక్షణంబు లని వ
చింతురు. కొందఱు ద్వివిధంబు లని చెప్పుదురు. ఇట్లొదవు లయంబులు పర
మమూర్తిమాయాకల్పితంబు లై ప్రవర్తించు నట్టి తేజోమయమూర్తి గుణవ్యా
పారపౌరుషంబులు ప్రత్యహంబును దలంచు పరమభాగవతోత్తములు సం
చితప్రారబ్ధకర్మవిముక్తు లై వైకుంఠపురంబు చేరుదు రని చెప్పిన విని నా
రదుం డి ట్లనియె.

33


క.

భువిని రసాతలజలముల
దివమునఁ దనువుల్ ధరించి తిరిగెడి జీవుల్
భవభయము లుడికి యే క్రియ
ననిరళగతిఁ జనుడు రిందిరాధిపు పురికిన్.

34


క.

బల మగు కర్మము లీ జీ
వులకుం బహుజన్మహేతువులు దత్కర్మం
బులఁ బాసి యిట్టి జీవులు
ప్రళయంబునఁ బొందు టెట్లు పద్మజ! ముక్తిన్.

35


క.

ఆ ముక్తిఁ బొందు జీవులె
యీ మహిఁ దిరుగం జనించు టేవిధమున సు
త్రామాదివంద్యపదయుగ
ప్రేమంబున నానతిమ్ము పృథుగుణనిలయా.

36


వ.

అని పలికిన తనయునకుఁ జతుర్ముఖుం డి ట్లనియె.

37


సీ.

సృష్ట్యుద్భవవ్యయస్థితులను మూడింటి
        కధిపతి పుండరీకాయతాక్షుఁ
డతని మాయను మగ్నులై సురేంద్రాదులు
        బాహ్యభాగంబున భ్రాంతి నొంది