పుట:భాస్కరరామాయణము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నడిగి మనము ప్రవర్తింత మనినజనకు, పలుకులకు మెచ్చి దశరథుఁ డలరె నపుడు.

689


క.

రాముని లక్ష్మణుఁ గొని వి, శ్వామిత్రుఁడు ప్రేమ మెసఁగ వచ్చినఁ గని య
త్యామోదముతో దశరథుఁ, డామునినాథునకు మ్రొక్కి యభిమత మొనరన్.

690


చ.

అనఘ మునీంద్ర మీకృపఁ గృతార్థుఁడ నైతిఁ దగంగ సర్వశో
భనములు గంటి నావుడు నృపాలక నీ వతిధార్మికుండ వ
త్యనుపమసత్యశీలుఁడ వుదంచితభాగ్యముకల్మి నీదునం
దనుఁ డగురామునిం బడసి ధన్యుఁడ వైతి సమస్తభంగులన్.

691


చ.

క్రతుపరిరక్షణంబునకుఁ గైకొని పంచిన వచ్చి నామఖం
బతిభుజశక్తిఁ గాచి రయ మారఁగ నెమ్మది నిల్చినారు నీ
సుతులను వీరిఁ జూడు మనఁ జొప్పడఁ బుత్రులు భక్తి మ్రొక్కినన్
హితమతి దీవనల్ పరఁగ నిచ్చుచుఁ గౌఁగిటఁ జేర్చె నర్మిలిన్.

692


క.

మఱునాఁడు దొరలుఁ దానును, మెఱయఁగ సభలోన నుండి మిథిలేశుం డ
క్కఱ ననుజుఁ దలఁచి నెయ్యము, వఱల శతానందుఁ జూచి వాంఛితబుద్ధిన్.

693


క.

ఇమ్ముగ నాయనుజుం డని, శమ్మును ధర్మపరుఁ డగుకుశధ్వజుఁడు ప్రమో
దమ్మున నిక్షుమతీతీ, రమ్మున సాంకాశ్య మనుపురంబున నుండున్.

694


క.

ఆతం డీకల్యాణము, ప్రీతిం జూడఁదగు నంచుఁ బిలిపింప నతం
డేతెంచి శతానందుని, బాఁతిగ జనకవిభుఁ జూచి భక్తిన్ మ్రొక్కెన్.

695


వ.

అనుజుని నుచితాసనంబున నుండఁ బనిచి మంత్రులం గనుఁగొని.

696


ఉ.

తోయజమిత్రవంశపతిఁ దోకొని రం డన మంత్రు లేఁగి భూ
నాయక మావిదేహజననాథుఁడు పిల్వఁగఁ బంచె మీయుపా
ధ్యాయులు మీరుఁ బుత్రులుఁ బ్రధానులు రం డన సంతసంబుతో
నాయవనీశ్వరుండు జనకాధిపు కొల్వున కేఁగి సమ్మతిన్.

697


మాకులగురుఁడు వసిష్ఠుఁడు, గైకొని కావింప నెల్లకార్యంబులకున్
మాకుం గలవాఁ డనవుడుఁ, గాకుత్స్థునిమాట కలరె గౌశికుఁ డెలమిన్.

698


వ.

అప్పుడు జనకుం జూచి దశరథునన్వయక్రమంబు వసిష్ఠుం డి ట్లని చెప్పె
నవ్యక్తప్రభవుం డగునాదిబ్రహ్మకు మరీచి మరీచికిం గశ్యపుండును గశ్యపునకు
వివస్వంతుండును వివస్వంతునకు వైవస్వతుండును వైవస్వతున కిక్ష్వాకుండు
నిక్ష్వాకునకుఁ గుక్షియుఁ గుక్షికి వికుక్షియు వికుక్షికి ననరణ్యుండు ననరణ్యునకు
బృథుండును బృథునకుఁ ద్రిశంకుండును ద్రిశంకునకు దుందుమారుండును
దుందుమారునకు యువనాశ్వుండును యువనాశ్వునకు మాంధాతయు మాంధా
తకు సుసంధియు సుసంధికి ధ్రువసంధియు ధ్రువసంధికిఁ బ్రసేనజిత్తును బ్రసేన
జిత్తునకు భరతుండును భరతున కసితుండు నుదయించి రాజ్యంబు సేయ నారా
జుపై హైహయులును దాళజంఘులును శశిబిందులు నేతెంచి యుద్ధంబు సేసి