Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మూర్ఛనొందిరి కొందఱు మూఁక గట్టి, కొంద ఱూరక భ్రమ మొంది రందులోన.

1726


తే.

తల్లడించుచు మింట గంధర్వవరులు, నీకుఁ దెరువులు శుభములై నెరయుఁ గాక
యీయుపక్రమ మేరికిఁ జేయఁ దరమె, కొండ గొనిపొమ్ము వానరకులలలామ.

1727


క.

అని గంధర్వులు తొలఁగిన, ననిలతనూజుఁడు మహీధరరాన్వితభుజుఁ డై
తను సిద్ధసాధ్యగణములు, వినుతింపఁగ గగనవీథి వెలుఁగుచు నరిగెన్.

1728

భరతునిదుస్స్వప్నము

చ.

భరతుఁడు నాఁటిరాత్రి యశుభం బగునక్కలలోనఁ గాననాం
తరమున రామలక్ష్మణులు తైలినిషిక్తశిరస్కు లై సుదు
స్తర మగుపంకమధ్యమునఁ దద్దయుఁ జిక్కి కృశాంగు లై మహో
ద్ధురగతి నేడ్చుచున్ వితతదుఃఖము నొందుటఁ గాంచి భీతుఁ డై.

1729


చ.

తడయక మేలుకాంచి కల దారుణ మం చెదఁ జింత నొంది త
ల్లడమున వెళ్లి వచ్చి వికలత్వము నొందుచు దుర్నిమిత్తముల్
గడుకొని చూచి మేను వడఁరకం బటుధైర్యము దూలిపోయి పెం
పెడలి బహుప్రకారముల ని ట్లనుచుం దలపోయు నాత్మలోన్.

1730


ఉ.

నక్కలు గూయఁ జొచ్చె గగనంబున నుల్కలు రాలఁ జొచ్చె నే
దిక్కున నైన ధూమములు దీటుకొనం గవిసెన్ ధరిత్రియున్
గ్రక్కతిలంగఁ జొచ్చె నధికంబుగ నొక్కత ముక్తకేశ యై
మిక్కిలి యేడ్చుచున్నయది మీఁదటికీ డది యేమి పుట్టునో.

1731


ఉ.

రాముఁడు లక్ష్మణుండును ధరాసుతయున్ బలుకాననంబులం
దేమివిధిం జరించిరొకొ యేవిధిఁ బొందిరొ యేమి యైరొకో
యామహనీయకీర్తులకు నాపదలున్ వెసఁ గల్గునొక్కొ యిం
కేమి తెఱంగొ దీనికి సమోహిత మెయ్యదియొక్కొ దైవమా.

1732


క.

పదునాల్గువత్సరమ్ములు, దుదముట్టఁగ వచ్చె నేఁడు తుదగా గురుస
మ్మదముగ వార్తయు వినరా, దది యేమియొ తెగిరొకో కృతాంతునిచెయిదిన్.

1733


క.

కృతయజనతపోదాన, వ్రతజప[1]తీర్థోపవాసవరసుకృతంబుల్
కృతమతి నిచ్చితి రామున, కతులితముగఁ గలుగ నభ్యుదయ మనుచు వెసన్.

1734


చ.

అనఘుఁడు భూసురోత్తముల నాగమవిత్తము లైనవారి రాఁ
బనిచి యనేకదానజపపావకతర్పణధర్మశాంతు లిం
పొనరఁగ వేదచోదితనియోగముతో నొనరించి నెమ్మనం
బున [2]దురపిల్లి నెవ్వగలఁ బొందుచుఁ గుందుచు నుండ నత్తఱిన్.

1735


మ.

ఉదయద్భాస్కరమండలోల్లసితకాయుం డుగ్రసంవర్తని
ర్యదుదగ్రానితుల్యసత్త్వుఁ డురుధైర్యాతీతశైలుండు భా

  1. తీర్థాధివాసవర
  2. దురటిల్లు నెవ్వగలఁ బొందుచు వందురుచుండ