Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్రానూనత్వము నిర్వహింపఁగ నుపాయం బిట్టు చింతించె దే
వా నాప ల్కిది నమ్ము ధీరునకు నీ వంతం బడం బోలునే.

1297


క.

కావున వేలిమి విఘ్నము, గావింపఁగ వలయుఁ గపినికాయము నెల్లన్
రావించి వేగ పనుపుము, భూవల్లభ తడవుసేఁత పోల దరయఁగన్.

1298


శా.

గృద్ధోలూకగరుత్సమీరవిచలత్కేతువ్రజంబున్ గల
త్వధ్రిచ్ఛేదవివల్గనోద్ధతహయవ్రాతంబు దైన్యోపసీ
దద్ధ్రస్వీభవదార్ద్రదానజలమాతంగంబు గాఁ బోరిలో
సధ్రీచీనతఁ దాల్పఁగాఁ బనుపుమీ సౌమిత్రితో సైన్యముల్.

1299


చ.

గొనకొని హోమకృత్యము నికుంభిలయం దొనరించు చున్నయ
ద్దనుజునిఁ గూల్ప లక్ష్మణు నుదగ్రతఁ బంపుము వేగవత్కన
త్కనకమనోజ్ఞపుంఖశరతాడితుఁ జేయుఁ బ్రచండమూర్తి యై
మొనసి నఖంబులన్ హరి సముద్ధతి మై గరిఁ ద్రుంచుచాడ్పునన్.

1300


మ.

వినుమా రాఘవ దాశకంఠి మును దోర్వీర్యం బఖర్వంబుగా
నొనరింపంగఁ దలంచి చేసెఁ దప మత్యుగ్రంబుగా దాన మె
[1]చ్చినవాఁ డై సరసీజయోని వెస నిచ్చెం గామగాశ్వంబు లిం
పొనరన్ బ్రహ్మశిరోస్త్రముం దగ నజయ్యుం డేరికిం బోరులన్.

1301


ఉ.

కీశచమూసమేతముగఁ గింకను లక్ష్మణుఁ డాజిలోన నా
కీశనిషూదనుం గదిసి యేపునఁ దూపులపాలు చేయఁ గీ
నాశనివేశనంబునకు నమ్మిన కాఁ పగుపంక్తికంఠుఁడున్
నీశరవృష్టి నీల్గు నిది నిక్కము గాఁగఁ దలంపు మాత్మలోన్.

1302


వ.

అనిన విని దశరథనందనాగ్రజుం డనుజున కి ట్లనియె.

1303


చ.

అరయఁగ మేఘమండలమునందుఁ దిరోహితుఁ డైనభానుతో
నొరయుచు మాయలం దనరి యుద్ధము సల్పెడు మేఘనాదుతో
దొరయఁగ లేరు దిక్పతులు దోర్బల మొప్పఁగ నీవు వాని ను
ద్ధురతరసాయకావలులఁ ద్రుంచి వధింపుము తెంపుపెంపునన్.

1304


చ.

జయ మొసఁగున్ రమావరుఁడు శంకరుఁడున్ సుఖ మిచ్చు నగ్నియున్
నియతము దేజ మొప్పఁ గరుణించుఁ జిరాయురుపేతుఁ జేయు బ్ర
హ్మయు నని పెక్కుదీవనల నాపతి తమ్ముని గారవించె వే
డ్కయుఁ గృపతోడినెయ్యము బెడంగున ముప్పిరి గాఁగ నెంతయున్.

1305


మ.

హరుచాపం బనఁ బోలువిల్లు నశనివ్యాఘాతబృందంబుతో
సరిఁ జేయం దగుసాయకంబులు నుదంచద్భీమనక్తంచరో
త్కరముం గూలుపఁ జాలుఖడ్గము సముద్యద్వజ్రసంఘాతభా

  1. చ్చినవాఁ డౌచు సరోజయోని