Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేవలయుఁ బోయి ర మ్మని, దీవించుచు వీడుకొలుపఁ దిర మగు వేడ్కన్.

1094

హనుమంతుండు సంజీవనిఁ దెచ్చుట

క.

వే చని చేయుదు నిప్పని, కేచింతయు నేటి కనుచు నేతెంచి నట
ద్వీచీసంఘట్టనమున, వాచాలం బైనలవణవారిధిచెంతన్.

1095


క.

అమరుసువేలము గని వేగమ యాగిరి యెక్కి రాముకార్యము నిర్వి
ఘ్నముగం జేయం గృపసే, యుము భూధర నాకు ననుచు నుత్సాహమునన్.

1096


ఉ.

పుట్టినవిక్రమస్ఫురణఁ బొంగినమే నతిఘోరభంగికిం
[1]బట్టుగ నేపుమై నిలిచి బాహులు సాంచి మహాట్టహాససం
ఘట్టన లంక గ్రక్కదలఁగాఁ గపివీరుఁడు దాఁటె [2]దాఁటునన్
మెట్టినకొండ గ్రుంగఁబడి మేదిని బీఁటలు వాఱ మింటికిన్.

1097


క.

వడి దాఁటుమేనిగాలిం, గడలెత్తి పయోధి మ్రోయఁ గా మేఘంబుల్
సుడిగొనుచుఁ జెదరి దిక్కులు, గడవం బఱవం బ్రచండగతి నటు చనుచున్.

1098


చ.

కలధౌతాద్రితటాంతరిక్షమునఁ జక్కం బాదముల్ మీఁదుగాఁ
౦దె
దలక్రిం దై కరపద్మముల్ నుదుట నందం బొంద జేపెట్టుచున్
లలి నాశంకరుశైలముం గడచి [3]బాలస్వేద మాస్యంబుపై
వలియం గ్రమ్మఁగఁ గ్రమ్మఱం దిరిగి పోవం బోవఁగా ముందటన్.

1099


మ.

అమృతాంశుద్యుతిజాలశీతలవికీర్ణాంభఃకణస్యంది యై
చెమటార్పన్ వలిగాలి రాఁగ నెదురన్ క్షీరాబ్ధిఁ గాంచెన్ నగో
త్తమమంథక్షుభితాంతరంగము ధరదైత్యారిశయ్యాభుజం
గము నుత్తుంగతరంగముం గృతవియృద్గంగాపరిష్వంగమున్.

1100


క.

కని యాజలధికి మ్రొక్కుచు, జని యుత్తరతీరభూమి సరి మూఁ డద్రుల్
ఘనవీథి దాఁకి యుండఁగ, వినువీథిం జేర నరిగి వికసితముఖుఁ డై.

1101


క.

కెలఁకులఁ జెన్నగునీనగ, ములు చంద్రద్రోణశైలములు మధ్యమునం
బొలుచు నిది యౌషధాచల, మలఘుతరద్యుతులు వెలుఁగు నవి యాతీఁగల్.

1102


క.

అనుచు నగోపరిభాగం, బునకుం జనుదెంచి వాయుపుత్రుం డచటన్
మును వెలిఁగెడునాలతికలు, కనుఁగవకుం దోఁపకున్నఁ గడువిస్మితుఁ డై.

1103


సీ.

కొండొక చింతించి కొండతో నిట్లను, హనుమంతుఁ డనువాఁడ నఖిలలోక
[4]కంటకుఁ డగుదశకంఠునిఁ దెగటార్ప, నాలంకపై దొర లట్లు విడిసి
సంగరక్రీడల శత్రువీరులచేతఁ, బోటేటుఁ బడి తూలి పుడమిఁ బడిన
వారి నందఱఁ దేర్పవలసినమందులు, నీయందుఁ గలుగుట నిక్క మెఱిఁగి
వచ్చినాఁడ నింక వంచన యేటికి, నెలమి నౌషధంబు లిత్తుగాక

  1. బ ట్టగుమూఁపునై నిలిచి
  2. దాపునన్ మెట్టిన
  3. ఫాలస్వేద
  4. కంటకు దశకంఠుఁ గడతేర్ప లంకపై, విడిసిన యారఘువీరు బంట, సంగర