Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మేరుశైలంబున దేవసభనుండి రాక విను మచటివృత్తాంతంబు లోకంబులకు
మీరు సేయునపకారంబులు సహింపం జాలక హరిహరహిరణ్యగర్భులు లోక
పాలురు దివాకరప్రభృతిగ్రహంబులు మరుద్వసుగంధర్వగుహ్యకగరుడోరగప్ర
ముఖామరగణంబులు నఖిలమునులునుం గూడి విచారించుసమయంబున బృహ
స్పతి వేల్పులెల్ల విన రావణుం డింద్రు భంగించి హుతాశను నోటువుచ్చె నంత
కుం బఱపె వరుణుం బరిభవించె జగత్ప్రాణు ధిక్కరించెఁ గుబేరు నాక్రమించె
జంద్రాదిత్యులతేజంబు లడంచె జన్నంబులు చెఱిచె నందనోద్యానంబు పెఱికె
దివ్యాంగనలం జెఱలుపట్టె మఱియు ధర్మాత్ముల ననేకులం జంపె నింక వానివ
ధోపాయంబు చింతింపుఁడనినం బితామహుండు మదీయవరంబున నాఁడు సురా
సురుల కజయ్యుండు నరవానరులచేతం బిచ్చు నది గారణంబుగా విష్ణుండు దశ
రథునకుఁ బుత్రచతుష్టయంబుగా జనించు నిలింపులు తరుచరులై జనియించి
యాతనికిఁ దోడ్పడుం డనుచు నంతర్హితుఁ డయ్యె నంత నందఱుం దమతమ
మందిరంబులకుం జని రని యమ్మహానుభావుండు చెప్పినాఁడు గావున రామచం
ద్రుండు నారాయణుండు బలిముఖులు బర్హిర్మఖు లిది నిక్కు వంబు న న్ననుగ్ర
హించి విగ్రహంబు విడిచి సీత నిచ్చి పుచ్చి రాక్షసకులంబును లంకను రక్షిం
పుము మనకొలుచుబ్రహ్మకు నుపాస్యుం డగునద్దేవదేవునకు నమస్కరించిన
నేమి కొఱంత యన్న నట్టికర్ణకఠోరంబు లైనకుంభకర్ణువచనంబులకుఁ గొండొక
తడవు వితర్కించి.

888


ఉ.

అక్కట నీకు నిట్లు భయ మందఁగ నేటికి వచ్చె రాఘవుం
డెక్కడ దేవతామహిమ మెక్కడ నారదువార్త వోవ ని
మ్మిక్కథ లేల విష్ణుఁ డన నెవ్వఁడు వేలుపుమేన నుండఁగా
మ్రొక్కనివాఁడ నాతనికి మొక్కుదునే మనుజత్వ మొందినన్.

889


క.

విను రాముఁడు విష్ణుం డా, తనితమ్ముఁడు లక్ష్మణుండు దా నలజిష్ణుం
డినసుతుఁడు భర్గుఁ డైన, వనరుహగర్భుండు జాంబవంతుం డైనన్.

890


ఉ.

నీ విటు విన్నవాఁడవఁట నిక్కము గా దన నాకు నేటికిన్
దేవహితంబుగా మనుజదేహము గైకొని వచ్చుటం బ్రతి
జ్ఞావిధి చొప్పడన్ మనలఁ జంపక విష్ణుఁడు రిత్తవోవునే
వేవురు చెప్పినం గృపణవృత్తి కొడంబడ నీను జానకిన్.

891


ఉ.

వామనమూర్తియై మొదల వచ్చి పదత్రయమాత్ర మర్థియై
భూమి నొసంగ వేఁడి పరిపూర్ణమనోరథుఁ డయ్యు నంతఁ బో
కామహితాత్ముఁ డైనబలి నంటఁగఁ గట్టి రసాతలంబున
న్బామఱఁ ద్రోచునట్టి కుహనాపరు సంధికి నమ్మవచ్చునే.

892


ఆ.

కాన విష్ణుఁ డైనఁ గానిమ్ము రాముతో, విగ్రహంబె కాని వినయ మొల్ల