పుట:భాస్కరరామాయణము.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఖయూథాధిపతులు చుట్టునుగా నడిచె నప్పుడు.

491


మహా.

బలపాదోద్ధూతధూళీబహుళపటల మస్పష్టదిగ్భాగ మయ్యున్
వలమానోత్తాలవాలవ్యజనవిరళ మై వంత మి ఱ్ఱేర్పడం జూ
డ్కులకుం బంటించున ట్లై కొని నిగిడి పురీగోపురోత్తుంగసౌధా
లి లలిం గప్పెం దదభ్రోల్లిఖిశిఖరమణు ల్మిన్కుమిన్కంచుఁ దోఁపన్.

492

,

వ.

ఇట్లు ధరాపరాగనిరంతరరోదోంతరంబుగా నడచునన్నరేంద్రుతోడం గూడ
దుర్వారవేగంబున.

493


చ.

ఉరుతరవాలభోగుల భుజోర్ముల నొప్పుచుఁ బొంగి మింటితో
నొరయుచుఁ బెల్లు దిక్తటము లొత్తుచు నద్రుల భూరుహంబులం
బొరిఁబొరిఁ గూలఁ ద్రోచికొని పోవుచు నంతయు ముంచికొంచు న
చ్చెరువుగఁ బోయి వెల్లివిరిసెం గపివాహిని లంకచుట్టునున్.

494


క.

అప్పుడు పదియోజనముల, విప్పున గాడ్పునకు దుష్ప్రవేశం బనఁగా
నప్పురము దిరిగి రాముని, చెప్పినకందువల నట్లు సేకొని విడియన్.

495


వ.

రఘుపతినియోగంబున లక్ష్మణవిభీషణు లయ్యైవాకిళ్లు నిలువ నీలునకు మైంద
ద్వివిదుల నంగదునకు ఋషభగజగవయగవాక్షగంధమాదనులను హనుమంతు
నకుఁ బ్రమాధిప్రజంఘులను గోటికోటిసంఖ్యాకంబు లైనకపిసైన్యంబుల
తోడఁ దోడుగా విడియించి మఱియును దగినయెడల వలయువలీముఖవీరులం
జాలించుచు నింద్రజిద్రావణరక్షితంబు లగుగవంకులకు మధ్యంబున మధ్యగుల్మం
బున సుపర్ణానిలసమానబలసంపన్నులు ముప్పదియాఱుకోట్లు యూథాధిపతులు
బలసి మలయ సుగ్రీవజాంబవంతుల నునిచి తారు ననేకానీకంబులు మెఱయ ను
త్తరద్వారంబున నరేంద్రుకెలంకులఁ గడిమిం బొలిచి నిలిచి రాసమయంబున.

496


సీ.

దుర్వారకల్లోలగర్వితాంబుధితోన, రాక్షసాంగనలగర్భములు గలఁగ
బొరిఁ ద్రికూటాద్రిగహ్వరములతోన న, క్తంచరభటులడెందములు పగుల
[1]నురగేంద్రదుర్భరధరణీభరముతోన, లంకాపురంబుసాలములు వడఁక
నస్తోకతరతారకస్తోమములతోన, గోపురంబులమణుల్ గుప్పగూల
బిట్టురవితేరిహరులు నిట్టట్టుఁ బఱవ, దిగ్గజంబులు బెగడంగ దెసలసంధు
లవియ రోదోంతరాళంబు సెవుడుపడఁగ, వీఁకమై నార్చి రందంద వృక్షచరులు.

497


తే.

ఆర్చి గిరిశిఖరంబులు నంఘ్రిపములుఁ, గొనుచుఁ గదియ రక్కసులును గుంతఖడ్గ
కార్ముకప్రముఖాయుధకలితభుజులుఁ, గవచధారులునయి కోటఁ గలయనలమ.

498

అంగదునిరాయబారము

వ.

అప్పుడు రఘుపుంగవుండు రాజనీతివిద్యావిశారదుఁ డగుట విభీషణానుమతి

  1. నురగేంద్రదుర్ధరధరణీధరముతోన