పుట:భాస్కరరామాయణము.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వనధిఁ గని హృదయ మవిసెనొ, తనుఁ గైకొనకున్నఁ గనలి దశకంఠుఁడు మ్రిం
గెనొ వికృతఘోరరాక్షస, జనఘనరూపములు సూచి సమసెనొ భీతిన్.

118


మ.

సతి నా కెక్కడఁ గానరా దలిగి రక్షస్స్త్రీలు భక్షించిరో
పతి భావించుచుఁ బ్రాణముల్ విడిచెనో పౌలస్త్యుచేఁ దప్పి యు
ద్ధతి నంభోనిధిఁ గూలెనో దశముఖోద్యద్భాహుసంపీడనా
న్విత యై స్రగ్గెనొ పంక్తికంఠుఁ డెడగా వే ఱొండుచో డాఁచెనో.

119


సీ.

జానకిఁ బొడగాన కేను బోయినఁ జూచి, మనుజేంద్రుఁ డప్పుడ మరణ మొందు
నన్నకు శోకించి యనుజుండు మృతిఁ బొందు, వార లిద్దఱు లేని వార్త యెఱిఁగి
భరతశత్రుఘ్నులుఁ బ్రాణముల్ విడుతురు, జనను లద్దశ సూచి చత్తు రోలిఁ
గాకుత్స్థకుల మంతఁ గడతేఱు రాఘవుల్, దెగఁ జూచి రవిజుఁడుఁ దీఱు నతఁడు
దీఱఁ దత్పత్ని రుమ దీఱు దినపసుతుని, వాలిఁ దలఁచి తార నశించు వారి కడలి
యంగదుఁడుఁ జచ్చుఁ గపు లెల్ల నంతఁ బొగిలి, వివిధగతుల జీవంబులు విడువఁగలరు.

120


ఆ.

కాన రాముకులముఁ గపికులంబును ద్రుంప, నేను బోవఁ జాల నెదుర నన్నుఁ
గాంచి గారవమునఁ గంటె జానకి నన్న, వెరవు మాలి రామవిభునితోడ.

121


క.

భూమిజఁ గానన యే నని, భీమానలతప్తసూచిభేదనబాధో
ద్దామం బగుదుర్వాక్యము, లే మని వినిపింతు నెదుటి కే మని పోదున్.

122


క.

జానకిఁ బొడగని రాఁ గల, నే నని నా కెదురుచూచుహితవానరసం
తానము నే మని చేరుదు, భానుజుముందఱికి నేమిపని యై పోదున్.

123


క.

జానకిఁ గానక యుండిన, వానప్రస్థుండ నగుదు వనధిం బడుదున్
మేను ఖగావలి కిత్తు మ, హానలముఖశిఖలు సొత్తు హితవిధిఁ జత్తున్.

124


క.

నిశితబలదర్పితుం డగు, దశముఖు విదళించి రామధరణీశునకుం
బిశితోపహార మిచ్చెదఁ, బశుపతికిం బశువుఁ జంపి బలి యిచ్చుక్రియన్.

125


క.

మ్రుచ్చిలి రఘుభూపతిసతిఁ, దెచ్చినదుర్వృత్తికిం బ్రతీకారముగా
మచ్చటులముష్టిహతుల వి, యచ్చరకంటకుని దర్ప మడఁచి వధింతున్.

126


మ.

అటు గా కుర్వి సమస్తముం బెఱికికొం చారాముఁ డీక్షింప నం
తట శోధించెద సీతఁ జూపు మని వేధం బట్టి బాధించెదం
బటురోషమ్మునఁ బాఱ మీటెద వడిన్ బ్రహ్మాండముల్ వీఁక నొ
క్కట లంకాదినిశాటకోటి నుదధిన్ గాలించి [1]కాఱించెదన్.

127


వ.

అని యి ట్లనేకప్రకారంబులఁ దలపోసి నా కిపుడు వేగిరపడ నేల జనకరాజనం
దనం గనుంగొనునందాఁక నిశ్శంక నీలంక నుండి వెదకెద ముందట నొక్కయు

  1. కూలించెదన్.