పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

346

బ్రహ్మోత్తరఖండము


దీపిత మగుశివలోకము
ప్రాపించె నిరస్తకర్మబంధుం డగుచున్.

321


క.

పతియాజ్ఞ శిరమునం దిడి
హితముగ విటలబ్ధవిత్త మిచ్చినకతనన్
సతి గాంచెను సద్గతి దా
నతిశయదుష్కర్మరహిత యై మోదమునన్.

323


వ.

ఇవ్విధంబునం దుంబురుండు జగజ్జననీశాసనంబున నాబ్రాహ్మ
ణుని పైశాచత్వంబు నివారించి దివ్యవిమానారూఢునిం
జేసి తోడ్కొనివచ్చి పరమేశ్వరసన్నిధానంబున నునిచిన
నాబ్రాహ్మణుండును నిజభార్యాసమేతంబుగాఁ బ్రణమిల్లిన
నుమామహేశ్వరులు సంతసించి బహుకాలంబు మద్భక్తు
లరై యథేచ్ఛావిహారులరై యుందురని వరం బొసంగినఁ
బ్రమోదంబున నుండిరని చెప్పి సూతుం డి ట్లనియె.

324


సీ.

మునులార వినుఁడు ముముక్షుజనార్హంబు
        భద్రప్రదంబు నభంగురంబు
నాయుష్కరంబు నిత్యారోగ్యకరమును
        ధన్యంబు సర్వపాతకహరంబు
కామ్యార్థధర్మమోక్షప్రదాయకమును
        సామ్రాజ్యఫలదంబు సౌఖ్యకరము
నింద్రాదిసేవితం బీశ్వరాభిమతంబు
       విజ్ఞానహేతువై వెలయునట్టి


ఆ.

యీపురాణరాజ మెవ్వరు చదివిన
వినిన వ్రాసినను సవిస్తరముగ