Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

బ్రహ్మోత్తరఖండము


విప్రసతి నీడ్చుకొనిపోయె విపినమునకు
నాక్షణంబున శార్దూల మద్భుతముగ.

271


మ.

వికటవ్యాఘ్రనిషూదితాంగయగుసాధ్విం గాంచి హాకామినీ
వికచాబ్జేక్షణ విద్రుమాధర లసద్వేదండకుంభస్తనీ
శుకసంభాషిణి మన్మనఃప్రియకరీ సోమాస్య యంచు న్మహా
నకఘోషంబున భూసురుండు వగచె న్నానాప్రకారంబులన్.

272


సీ.

అని విలాపించుచు నారాజు నీక్షించి
        యెలమి నాబ్రాహ్మణుఁ డిట్టులనియె
నీగురుం డగుశివయోగి యెచ్చటి కేఁగె
        శైవవర్మంబు నేత్రోవఁ జనియె
ద్వాదశసాహస్రవేదండబల మెద్ది
        ఖడ్గశంఖంబు లెక్కడ వసించె
నస్త్రమంత్రాదివిద్యాభ్యాస మేమాయె
        భవదీయశౌర్య మేభంగి నుడిగె


తే.

నిన్నియును గల్గియుండి నీ వెంచిచూడ
వనమృగంబును జంపలే వైతి విపుడు
కాన నీపౌరుషంబెల్లఁ గానవచ్చె
వజ్రబాహుకుమార నిర్వహణదూర.

273


క.

భీతుల నార్తుల దీన
వ్రాతముల ననాథజనుల వాత్సల్యమునన్
బ్రీతిం బోవని మనుజుఁడు
భూతలమున నెంచి చూడఁ బూజ్యుం డగునే.

274


ఆ.

ధనము సంగ్రహించి దానం బొనర్పని
గృహపతికిని భైక్షవృత్తి మేలు