Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

177


గంఠసూత్రాదిభూషణకలితుఁ డగుచు
సోమవంతుఁడు కృత్రిమభామ మయ్యె.

225


క.

క్షితిపతియాజ్ఞావిధమున
నతిశయసౌందర్యవంతు లావిప్రులు దం
పతివేషంబులు దనరఁగ
రతికుసుమాయుధులమాడ్కి రంజిల్లి రొగిన్.

226


వ.

ఇట్లు రాజానుశాసనంబున నాబ్రహ్మచారులిరువురు కృత్రిమ
దంపతివేషంబులు ధరియించి కాఁగలయర్థంబు లవశ్యం
బుగా ననుభోక్తవ్యంబులని ధైర్యం బవలంబించి కతిపయ
దినప్రయాణంబులన్ జని చని యభ్రంకషమణికాంచన
సౌధప్రాకారగోపురంబును నిజవైభవపరాభూతగోపురంబును
నగునిషధపురంబుం బ్రవేశించి తత్పట్టణవిలాసంబు లాలో
కింపుచు రాజమార్గంబున నరుగుదెంచి యచ్చట నానాదేశ
సమాగతబ్రాహ్మణవధూవరులం గాంచి వారలుం దామును
రాజమందిరద్వారంబు చేరువ నుండునంత.

227


క.

ఆవేళ సోమవారము
గావున సుస్నాత యగుచుఁ గౌతుకమున నా
భూవరపత్నియును మహా
దేవాగారంబు సొచ్చెఁ దేజం బలరన్.

228


క.

ఆసమయంబున నచటికి
భూసురముఖ్యులును మఱియు భూసురవనితల్
హాసోల్లాసముఖంబుల
నాసాధ్వీమణిని జేర నరిగిరి వరుసన్.

229


తే.

మేదురంబుగ వాదిత్రనాదములును