Jump to content

పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

బ్రహ్మోత్తరఖండము


వ.

అని పల్కి యాగంధర్వరాజకన్యక సఖీజనసమీపంబునకు
మరలం జనియె నంత నారాజకుమారుండును భూసుర
నందనుం డున్నయెడకు వచ్చి గృహంబునకుం జని తమతల్లికి
మనఃప్రియంబు గావింపుచు నారేయి గడపి మరునాఁడు
ప్రభాతకాలంబున ద్విజపుత్రకసహితంబుగా వనంబుఁ
బ్రవేశించి పూర్వనిర్దిష్టం బైనప్రదేశంబునకుం జని.

368


క.

కనుఁగొనె నాబాలకయుగ
మనుపమతేజోభిరాము డఁగుచిత్రరథుం
దనయాయుతుఁడై యతఁడును
గనె నంతఁ గుమారకుల వికాసితముఖులన్.

369

చిత్రరథుం డను గంధర్వరాజు ధర్మగుప్తునకుఁ దనకూఁతు నిచ్చి వివాహం బొనర్చుట.

ఆ.

కాంచి మోద మలర గంధర్వనాథుండు
సాదరముగ వారి సన్నుతించి
లలితవృక్షమూలతలమునఁ గూర్చుండి
నృపకుమారుతోడ నిట్టు లనియె.

370


సీ.

భూపాలసుత విను పూర్వదినంబున
        జనియుంటి కైలాసశైలమునకు
నాస్థలంబున గంటి నార్యాసమేతుఁడై
       వెలయుమహాదేవు విశ్వనాథు
నంత నద్దేవేశుఁ డఖిలసుపర్వులు
       వినఁగ నాతో నిట్టు లనుచుఁ బలికె
ధర్మగుప్తుం డనుధరణీశనందనుఁ
       డొకఁడు వర్తించు నీయుర్వియందు