పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

5


వ.

ఇట్లు మదీయభాగ్యదేవతయనుంబోలెఁ బ్రసన్నుండయి
వెలుంగుచున్న యద్దివ్యపురుషునిం గాంచి భయభక్తి
వినయసంభ్రమంబులు దోఁపం బులకీకృతశరీరుండ నయి
యేను బ్రణామకృత్యంబు లాచరించి నిటలతలఘటితాంజలి
పుటుండ నయి యున్న నన్నుం గరుణార్ద్రదృష్టిం జూచి
యమ్మహాత్ముండు సర్వజ్ఞుండు గావున మన్మనోభిప్రాయం
బెఱింగి యేను గరుణామృతసముద్రుండ నగురామ
భద్రుండ భవద్వాంఛితంబు సఫలంబుసేయుటకు నీకుం
బొడసూపితి నని పలికి మఱియు ని ట్లని యానతిచ్చె.

16


తే.

నీవు కృతి నొనరింపఁ బూనితివిగాన
దాని కేను సహాయతఁ దగ నొనర్తు
రమ్యతురముగ నాంధ్రగీర్వాణభాష
ణములరచియింపు మఖిలమానవులువొగడ.

17


క.

శంకరుఁ డేనును నేనే
శంకరుఁడును గాన నీదు సమ్మతముగ ని
శ్శంకమతి నొకరిపేరిట
నంకితముగఁ గృతియొనర్చు మలరు శుభంబుల్.

18


వ.

అని యానతిచ్చి యమ్మహాత్ముండు తిరోధానంబు నొందిన
నేను బ్రభాతసమయంబున మేల్కాంచి యాశుభ
స్వప్నంబు మదీయచేలాంచలస్థితం బయినమహాధనంబుగా
నిశ్చయించి మత్కావ్యంబునకు నెయ్యది సమకూరునో
యని వితర్కించుచున్నసమయంబున.

19