పుట:ప్రబోధచంద్రోదయము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భృంగమౌర్వీనినాదకంపితసమస్త
పటువియోగిజనప్రాణ! పంచబాణ!

(4-10)

వీనికి మూలము లేకపోవుటచే వీరేశలింగముగారు “ఇది యొకప్రతియం దున్నది ప్రక్షిప్తమై యుండును. ఇదియొక ప్రతిలోనే యున్నది. ప్రక్షిప్త మని తోచుచున్నది." అని అధోజ్ఞాపికలు వ్రాసి యున్నారు.

అననువాదములు

ఇట్టిది యొకటియే యున్నది.

నిహతస్యపశోర్యజ్ఞే
స్వర్గప్రాప్తిర్యదీక్షితే
స్వపతాయజ మానేన
కింనతస్మాన్నిహన్యతే

(6-25)

ఈ శ్లోకము ప్రబోధచంద్రోదయనాటకమున నున్నను నది కృష్ణమిశ్రరచితముగాదు. కృష్ణమిశ్రుడే ఉపనిషద్దేవిచేత ఈ శ్లోకమును పలికించినాడు. ఈ శ్లోకము భగవద్గీత 18వ అధ్యాయమున 19వ శ్లోకము. కావుననే నీ కవులు దానిని విడిచిపెట్టిరి. యథానువాదము గావించిన యధునాతనకవులు దీనిని యాంధ్రీకరింపలేదు. ఒక్క గట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారు మాత్రమే యనువదించిరి.

జంటకవులు దీనిని విడిచి పెట్టుటకు నింకొకహేతు వున్నది. వీరు శైవులు. శైవులకు భగవద్గీత ఎంతమాత్రమును ప్రమాణగ్రంథము గాదు. వారి కాగమములే ప్రమాణములు.

వర్ణనలు

కృతిపతియైన గంగన కవులను ప్రబంధరీతిని ప్రభోదచంద్రోదయనాటకమును రచింపుడని యభిలషించినట్లు గలదు.

క.

అనవుడు ననంతవిభు గం
గన వారలఁ జూచి యిట్టి ఘననాటకముం