పుట:ప్రబోధచంద్రోదయము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూలమున నాందీశ్లోకములలో మొదటిది అద్వైతబ్రహ్మమును, రెండవది శివుని తెలుపును. చంద్రార్థమౌళి యని కవియే స్పష్టపఱచినాడు. తెలుగున నీరెండుశ్లోకములును శివునిపరముగా నన్వయింపబడినవి.

రెండవశ్లోకములో మూలమున “శాంతిప్రణయిని" అని అద్వైతపరముగా యుండగా తెలుగున ఆదిశక్తి అని శివశక్తిపరముగా నున్నది.

తెలుగున కవులిద్దరు నీశ్వరారాధకు లగుటవలన అనగా శివారాధకులైన శైవు లగుటచేత అద్వైతపరముగా నున్నదానిని శివపరముగా మార్చినారు.

గురుస్తుతి

పైరెండుశ్లోకముల పద్యానువాదము తమ గురువగు దక్షిణామూర్త్యఘోరశివాచార్యుల పరముగా చెప్పబడినది. గురువు సాక్షాత్తు శివస్వరూపుడు.

"గురురహ్మ గురుర్విష్ణు గురుసాక్షా న్మహేశ్వరః
గురుశ్చ మాతాపితరౌ తస్మైశ్రీ గురువేనమః"

అనిసూక్తి.

అద్వైతబ్రహ్మమును, శివునితో, తమగురువుతో సమన్వయము చేసి స్తుతించుటవలన ఇచట దైవపరమగు శివస్తుతిగాక దైవస్వరూపమానవుడైన తమ గురుస్తుతి యైనది.

యథామూలానువాదములు

1)

వేశ్యావేశ్మసుసీధుగంధలలనావక్త్రానవామోదితై
ర్నీత్వా నిర్బరమన్మథోత్సవరసైరున్నిద్ర చంద్రాక్షపాః
సర్వజ్ఞాఇతి దీక్షితా ఇతిచిరాత్రప్రాప్తాగ్నిహోత్రాయితి
బ్రహ్మజ్ఞాఇతి తాపసాయితి దివాధూర్యై జగద్వంచతి

2 అం. 1శ్లో


మ.

రతులన్ సీధురసంపుక్రోవులగు వారస్త్రీల కెమ్మోవులన్
మతి నుప్పొంగుచుఁ గ్రోలి వెన్నెలల నానందించి రేపాడి దీ
క్షితులై తాపసులై సదాజపితలై క్షీరోదకాహారులై
యతులై దంభత మోసపుచ్చుదురు మర్త్యశ్రేణి ధూర్తోత్తముల్

(2-3)