మూలమున నాందీశ్లోకములలో మొదటిది అద్వైతబ్రహ్మమును, రెండవది శివుని తెలుపును. చంద్రార్థమౌళి యని కవియే స్పష్టపఱచినాడు. తెలుగున నీరెండుశ్లోకములును శివునిపరముగా నన్వయింపబడినవి.
రెండవశ్లోకములో మూలమున “శాంతిప్రణయిని" అని అద్వైతపరముగా యుండగా తెలుగున ఆదిశక్తి అని శివశక్తిపరముగా నున్నది.
తెలుగున కవులిద్దరు నీశ్వరారాధకు లగుటవలన అనగా శివారాధకులైన శైవు లగుటచేత అద్వైతపరముగా నున్నదానిని శివపరముగా మార్చినారు.
గురుస్తుతి
పైరెండుశ్లోకముల పద్యానువాదము తమ గురువగు దక్షిణామూర్త్యఘోరశివాచార్యుల పరముగా చెప్పబడినది. గురువు సాక్షాత్తు శివస్వరూపుడు.
| "గురురహ్మ గురుర్విష్ణు గురుసాక్షా న్మహేశ్వరః | అనిసూక్తి. |
అద్వైతబ్రహ్మమును, శివునితో, తమగురువుతో సమన్వయము చేసి స్తుతించుటవలన ఇచట దైవపరమగు శివస్తుతిగాక దైవస్వరూపమానవుడైన తమ గురుస్తుతి యైనది.
యథామూలానువాదములు
1) | వేశ్యావేశ్మసుసీధుగంధలలనావక్త్రానవామోదితై | 2 అం. 1శ్లో |
మ. | రతులన్ సీధురసంపుక్రోవులగు వారస్త్రీల కెమ్మోవులన్ | (2-3) |