పుట:ప్రబోధచంద్రోదయము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధచంద్రోదయము

పీఠిక

తాళపత్రపత్రులు

ఈ కావ్యమునకు తాళపత్రప్రతులు తంజావూరు సరస్వతీమహలునందుగాని – ఆంధ్రసాహిత్య పరిషద్భాండాగారముగాని లేవు - అవి మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండారమునందే యుండెడివి. ప్రస్తుతము తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయములో నున్నవి. వాని వివరములు.

1.

R- 50 (C) Fol. 171-a-214–b సమగ్రము కాని కృత్యవతరణికయందు గృతిపతి వంశవర్ణన పద్యములు పెక్కు విడనాడబడెను. వ్రాత చక్కనై యున్నది. తప్పులు లేవు. శైథిల్యములేదు. గ్రంథపాతము లంతకంటె లేవు. లేఖన కాలము - విలంబి కార్తీక బహుళ విదియ.


2.

D. 578 - పత్రములు 76.
సమగ్రము. వ్రాతమంచిది. పత్రమున నొకవైపు పేరు వ్రాయబడినది - తప్పులుగలవు. శైథిల్యము గలదు. గ్రంథపాతములు లేవు.


3.

R. 446. 53 పత్రములు.
సమగ్రము. వ్రాత యంతమంచిది గాదు. తప్పులు లేవు. శైథిల్యగ్రంథపాతములు లేవు - లేఖకుడు బహుధాన్య మార్గశిర శుద్ధ విదియా ఆదివారమునాటికి పూర్తిచేసినాడు. ఇది క్రీ. శ. 29-11-1818తో సరిపోవును.

ముద్రణ ప్రతి

ఈ గ్రంథమును తొలుత (1900) ముద్రించినవారు వీరేశలింగముపంతులుగారు. వారు దీనిని తమ చింతామణీముద్రాక్షరశాల (మదరాసు)లో ముద్రించినారు. దీని ప్రథమముద్రణ ముఖపత్రము నిందుతో నిచ్చితిని - క్రీ. శ. 1904లో వీరేశలింగముగారే ఈచింతామణి ముద్రాక్షశాలలో ఈ కృతికర్తల వరాహపురాణమును ముద్రించి యున్నారు.