ప్రబోధచంద్రోదయము
పీఠిక
తాళపత్రపత్రులు
ఈ కావ్యమునకు తాళపత్రప్రతులు తంజావూరు సరస్వతీమహలునందుగాని – ఆంధ్రసాహిత్య పరిషద్భాండాగారముగాని లేవు - అవి మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండారమునందే యుండెడివి. ప్రస్తుతము తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయములో నున్నవి. వాని వివరములు.
1. | R- 50 (C) Fol. 171-a-214–b సమగ్రము కాని కృత్యవతరణికయందు గృతిపతి వంశవర్ణన పద్యములు పెక్కు విడనాడబడెను. వ్రాత చక్కనై యున్నది. తప్పులు లేవు. శైథిల్యములేదు. గ్రంథపాతము లంతకంటె లేవు. లేఖన కాలము - విలంబి కార్తీక బహుళ విదియ. | |
2. | D. 578 - పత్రములు 76. | |
3. | R. 446. 53 పత్రములు. | |
ముద్రణ ప్రతి
ఈ గ్రంథమును తొలుత (1900) ముద్రించినవారు వీరేశలింగముపంతులుగారు. వారు దీనిని తమ చింతామణీముద్రాక్షరశాల (మదరాసు)లో ముద్రించినారు. దీని ప్రథమముద్రణ ముఖపత్రము నిందుతో నిచ్చితిని - క్రీ. శ. 1904లో వీరేశలింగముగారే ఈచింతామణి ముద్రాక్షశాలలో ఈ కృతికర్తల వరాహపురాణమును ముద్రించి యున్నారు.