తమతమయుక్తిబలంబులఁ బదార్థభేదంబులు గల్పించి వావదూకులైనడ
దుర్విదగ్ధులు సర్వజనంబులు మోసపుచ్చుచున్నవా రింతియ కాని మాకు నిది
యొడంబడిక కాదు. తొడిఁబడం జెల్లుఁబడిగల వార లేమి చేసినం జెల్లియ
పోవుఁగాక లోకంబులఁ గృత్యాకృత్యంబులు గలవనుట మిథ్య తథ్యంబు
లోకాయతికంటె శాస్త్రంబు దండనీతియె విద్య, ప్రత్యక్షంబె ప్రమాణంబు,
పృథివ్యప్తేజోవాయురాకాశంబులే తత్త్వంబులు. భూతంబులే ప్రేరకంబులు,
చచ్చుటయే మోక్షంబుగాక పరలోకంబన నెక్కడియది. యిదియ కదా
వాచస్పతి చార్వాకున కుపదేశించె నతండును శిష్యప్రశిష్యపరంపరవలన
జగంబునం దనమతంబు బహుళంబు చేయవలసి కురుక్షేత్రాదిపుణ్య
క్షేత్రంబులకుఁ జనినవాఁడు వాఁడును మనల మిచ్చటకు వచ్చుట విని
యింతకుఁ జనుదెంచు ననిపలుకు నవసరంబునఁ జార్వాకుండును సర్వ
తీర్థంబులఁ జరియించి మహామోహుమహిమాక్రాంతంబైన కాశికానగరంబు
ప్రవేశించి యందు నిజమతప్రకారంబు విలోకించి సంతసించి శిష్యునితోడ
వత్సా! ప్రత్యక్షాప్రత్యక్షఫలమూలంబైన కృషిగోరక్షణాదిసహితదండ
నీతియ మంచివిద్యయని యెఱుంగక కొందఱు మూఢులు మునిభండ
నిశాచరప్రముఖధూర్తప్రలాపితంబైన వేదత్రయంబు చదువుదు రందు
వృథాప్రయాసంబెకాని భుక్తిలేదు. పరలోకంబు మొదలికే లేదు. వేదోక్త
ధర్మంబు లబద్ధంబు లగుట చెప్పెద వినుము.