పుట:పంచతంత్రి (భానుకవి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధర్మమ్ము గుణము సత్యమ్మును దనతోఁడు
                    నీడలు నాఁగ వర్ణింపఁ దనరె


గీ.

నవని నానార్థిజనదరిద్రాంధకార
పటల మణఁగించె నరవిందబంధుఁ బోలి
సఖులపాలిటి కల్పవృక్షమ్ము దలఁప
మంత్రిమాత్రుండె విఠ్ఠయామాత్యవరుఁడు.

28


గీ.

అతనికిని భార్యయై రుక్మమాంబ యపుడు
దేవతాగురుభక్తి యతిథిసపర్య,
పతి సమారాధనక్రియాపరత, తనకుఁ
గరము పెంపొం[దు భూషలుగాఁ జెలంగె.]

29


వ.

వారిరువుర భాగ్యవశంబున.

30


సీ.

ప్రత్యర్థిపార్ధివపట్టణద్వారక
                    వాటపాటనబలోజ్జ్వలభుజుండు
సప్తసముద్రాంతశైలోపరిస్థలీ
                    సంకీర్ణగుణలతాసంచయుండు
[హరజటా]నిర్గతసురధునీభంగ
                    నిర్హ్రాదజృంభితవాగ్విరాజతుండు
ఛద్మమంత్రిలలాటచారుభాగ్యాక్షర
                    సంహృతిదీప్తవిచక్షణుండు

31


గీ.

సజ్జనవ్రాతదైన్యతుషారహరణ
కమలమిత్రుండు కవిరాజకల్పశాఖ
పంచబాణనిభుం డుదయించె బంధు
రక్షణము సేయ లక్ష్మీనారాయణుండు.

32


చ.

అమలినచందనా[స్పదము నాయత]వృత్తగుణమ్ము చారుభో
గము గల లక్ష్మమంత్రి కరకంజము జేరినయట్టి ధాత్రి క్రో
డమునకు వ్రీడఁ జేసి జగడంబుల [గచ్ఛపు]దుచ్ఛ మాడి [లో
కములను శేషు]దోషయుతుగా నొనరించెను సార్వకాలమున్.

33


సీ.

ఏ మంత్రి సితకీర్తి హీరకర్పూరనీ
                    హారహారమ్ముల నపహసించు
నే మంత్రి శేముషీభీమవిక్రమ [మరి
                    రాజన్యులకుఁ గూర్చు రంభపొందు]