పుట:పంచతంత్రి (భానుకవి).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నత్తరు వెక్కి మానసమ్ము డిందుపఱచుకొని పుత్రమిత్రకళత్రభృత్యామా
త్యులం గనుంగొని, నేఁడు నాచావు దప్పె, నేఁ జేసిన భాగ్యవశంబున మిమ్మం
దఱం గ్రమ్మఱం జూడఁగంటినని వారలకుం జెప్పి, భూజమూలమ్మున నున్న
నక్రేశ్వరుం జూచి శింశుమారా! నాగుండియ యీతరుశాఖాగ్రమ్మున
నున్నది నీ వెక్కి తెచ్చుకొమ్మని పకపక నగి హాస్యమ్ము చేసి యిట్లనియె,—

42


క.

హృదయము కర్ణంబయ్యెను,
మద మణఁగిన ఖరముగాను మకరాధిప! నే
ర్పొదవ విడివడియుఁ గ్రమ్మఱ
మది వొదియుట కనిన, శింశుమారుం డనియెన్.

43


వ.

నాకైతవం బెఱింగి వెడ్డు పెట్టి తిరిగితివి నీయంత నేర్పరి భూలో
కమ్మునం గలఁడే! అయినను మేలు దలంచినవానిమీఁదం గీడు దలంచినఁ
దుదకెక్కునె! కృతఘ్నుండనని, వెండియు నిట్లనియె,—

44


గీ.

కలుషమతినైన నాకు నీకథ యెఱుంగఁ
జెప్పి సంతోషచిత్తుగాఁ జేయుమనినఁ
బ్లవగముఖ్యుండు రోషమ్ము వాసి యప్పు
డతనివదనమ్ముఁ జూచి యిట్లనుచుఁ బలికె.

45


సీ.

ము న్నొక్కకాననంబున మృగేంద్రుండు గో
                    మాయుప్రభుం డాత్మమంత్రి గాఁగఁ
జరియించు నపుడు కుంజరమాంసతుందిలం
                    బగు మేన నొక్కనాఁ డతఁడు కుక్షి
రోగియై సచివవరునిఁ జూచి యో భద్ర!
                    రాసభ హృదయకర్ణములు గలుగ,
నిలుచుఁ జేతనములు, దలపోయ, లేకున్న,
                    వశముగాదని పల్క, వాఁడు సూచి
అధిప! యెచ్చోట నుండిననైన వెదకి
తీపుమాటలఁ దేలించి తెత్తు మీకుఁ
బ్రియము సొంపార నని చెప్పి, నయముతోడ
బాసి చని యొక్కపట్టణప్రాంతమునను.

46