పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కదిసి తద్భేరీముఖము వ్రచ్చి లోపల నరయ నిర్మానుషమగుట మేను
పొదలఁ జేకుఱె మహాభోజనం బని చని వడి మేను మలఁచి నల్గడలు సూచి
కరటగృధ్రోలూకకంకాదుల శవామిషాదులఁ దోలి నే నాఢ్యలీల


తే.

దంతిపలల మశ్వతరసంబుశాక్వర, క్రవ్యముష్టమాంసఖండకాండ
మొలసి యున్న నరులపొలయును దిని గాఢ, కౌతుకమున నుంటిగాఁదె తొలుత.

193


వ.

రవశ్రవణమాత్రంబున నేమి తెలిసికొని నిర్భయుండ వగుము శబ్దం బేదిక్కున
నాకర్ణింపంబడియె నద్దిక్కువకు నన్ను౦ బనుపు మంతయుం దెలిసి వచ్చెద ననుట
యుఁ బింగళకుం డట్ల చేయుమనియె నట్లు నియుక్తుండై దమనకుండు సకలమృగ
సంచారఘోరం బగు యమునాప్రాంతకాంతారంబున కరిగి పురోభాగంబున.

194


ఉ.

చేపఁ జిగుర్చుశృంగములు శృంగములం బ్రకటింపు భూరిశో
భావిహనైకపాదములు పాదముల న్దలఁపింప జంగమ
గ్రావముభంగి భానుభవకచ్ఛమున న్విహరించువాని సం
జీవకుఁ గాంచి మ్రొక్కి నిలిచె న్మృగధూర్తకుమారుఁ డయ్యెడన్.

195


వ.

అట్లు వినీతత్వంబు నెరపి కైవారంబు సేసి యతనిచేత నాగమనకార్యం బడుగం
బడినవాఁడై.

196


చ.

హృదయము పల్లవింప నతఁ డిట్లను నెంతయు సమ్మదంబునం
బొదలుచు నీసమాగమము పూర్వము నీ కెనయైనవానితోఁ
గదిసి యఖండసఖ్యమునఁ గాల మతీతముగా నొనర్ప కి
న్నదిదరి నొంటి నుండఁదగునా మృగనాథులు లేరె మైత్రికిన్.

197


చ.

అనఘచరిత్ర పింగళకుఁడ న్మృగరా జిటనుండు నమ్మహా
ఘనుని ప్రధాననందనునిఁగా నను బుద్ధి నెఱుంగు నీకు నా
యనకు ఘటింతు మైత్రి సమయం బిదె న న్బనిఁగొమ్ము మారుతం
బనలము గూడినట్లయగు నాతఁడు నీవును జెల్మి సేసినన్.

198


క.

అన విని దమనకునిఁ గనుం, గొని సంజీవకుఁడు వలికె గొబ్బున మరలం
జని చెలిమి సేయుమా మా, కనుకూలత మెఱయ మామృగాధిపుతోడన్.

199


క.

పొమ్మన నెమ్మన మలరం, గ్రమ్మఱ మృగధూర్తకులశిఖామణి చింతా
సమ్మూర్ఛితాకృతిం బడి, నమ్మేర న్గాంచి వినతుఁడై నిలుచున్నన్.

200


క.

కనుఁగొని పింగళకుం డి, ట్లను సనయా మంత్రితనయ యచ్చోటికి నా
యనుమతిఁ గైకొని పోయిన, పని యేమి యొనర్చి తనినఁ బలికె నతండున్.

201


క.

పొనసొనఁ గానకు దేవర, పనుపునఁ జని యచటఁ గంటిఁ బ్రళయాంతరట