పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెలియలని చూడఁ గినిసిన, దలఁ గోయుదుఁ బతికి సమ్మదము గానిది య
వ్వల కేల హితుల కేటికి, లలనామణి యిది మొద ల్మెెలఁగు నీయాజ్ఞన్.

209


వ.

అని భయంబుఁ బుట్టించి కృతసత్కారుండై చోరుండు సార్ధవాహు వీడ్కొని చని
యె నాసమయంబున.

210


సీ.

రాజాస్యముఖతామరసవాసనల గ్రుక్క నానుముక్కునబంటి యైనదనుక
ధరపయోధరసుధాధరరసంబునఁ జొక్కుఁ బంచబాణపిపాస పాయుదనుక
జంచలేక్షణఘనస్తనగుళుచ్ఛకముల నలముహస్తగ్లాని దొలఁగుదనుక
నాతిగాఢాలింగనమునఁ దెప్పలఁదేలు బొంది తాపము శాంతిఁ బొందుదనుకఁ


తే.

బ్రాయ ముడిబోయి కసరింకఁ బాఱియుండు, పంటిచాట్పున నెఱవేరుపడినయొడలి
పరుసుసెట్టన బీదచే పడినపగిదిఁ, గులుకుగుబ్బెతవయసెల్లఁ గొల్లలాడె.

211


సీ.

ఉదయవేళకుమున్నె నిదుర మేల్కని వచ్చి ప్రాణవల్లభుపదాబ్జముల వ్రాలు
వ్రాలి నిర్మలతరజ్వలనతప్తసువర్ణకలశోదకంబుల జలక మార్చు
జలక మార్చి సపర్వశర్వరీశాతపోత్తాలచేలంబులఁ దాల్ప నిచ్చు
లిచ్చి పొచ్చములేక హేమపాత్రంబున నిష్టాన్నముల భుజియింపఁ బెట్టుఁ


తే.

బరిమళముఁ బూయుఁ గపురంబుసురటి విసరుఁ, బూవుదండలఁ జుట్టుఁ దాంబూల మిచ్చు
బడక సవరించుఁ జిటిపొటి నడుగు లొత్తు, నలముఁ గౌఁగిట నాతి చోరాతిభీతి.

212


ఉ.

ఏరికినైనఁ జోరుఁడు సుహృత్తముఁడే యతఁ డేల సేసె స
త్కారము సార్ధవాహునకుఁ గన్గొన నిచ్చిరజీవి తావకీ
నారికి ముఖ్యమంత్రి యగు నైనను నీతిపరుండు గాన నే
తీరున నైన నిట్టిసుమతిప్రవరుఁ డశుభం బొనర్చునే.

213


క.

అని దీప్తాక్షుఁడు చెప్పిన, విని యరిమర్దనుఁడు నీతివిభవవిలాసున్
వినుతాసువక్రనాసుం, గనుఁగొనుటయు నతఁడు కౌశికప్రభుమొగమై.

214


క.

కంటకులు రిపులు దమలో, నొంటక పురిఁ బాసి యూర నొకఁడై విను మి
ట్లొంటిఁ గృశియింపుచుండుట, గెంటనిశోభనము గాదె క్షితిపా నీకున్.

215


ఉ.

ఈతఁడు మేఘవర్ణునకు నిష్టము గల్గినవాఁడు సత్క్రియా
న్వీతుఁడు రాజకార్యపరినిష్ఠితుఁ డీతఁడు లేమి లేమిసు
మ్మాతని కూర్జితైకవిజయస్థితి నీ కితఁ డున్కిఁ జేసి వి
ఖ్యాతి వహింతు శత్రుబలహైన్యము నీకు శుభంబు గాదొకో.

216