పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాలవశంబు గాక యది గానక హీనుఁడు పాఱుఁ బ్రాజ్ఞుఁ డా
వేళఁ దొలంగిపో కనుభవించును నిందును నందు సౌఖ్యముల్.

232


వ.

అదియునుంగాక.

233


సీ.

వైరంబు కొఱ గాదు వసుధ నెవ్వారికి, నట్టిది బలవంత మయ్యెనేని
తగినసాహాయ్యంబు దలగూర్చుకొని పగ సాధింపవలయు నుత్సాహలీల
బలముఁ గూడకమున్న పగతుండు తఱినేచి గొదగొని చిక్కించుకొనియెనేని
నొదుగక పగరపై నుఱికి చంపుట యొండె, రణమున వారిచేఁ జచ్చు టొండెఁ


గీ.

బాఱి కలకాల మెవ్వాఁడు బ్రతుకు నంచుఁ, బ్రాణసందేహమునఁ దెగుఁ బ్రాజ్ఞుఁ డెఱిఁగి
సాహసము చేయ నాకును సమయ మనుచు, నుఱికి కొక్కెరకంఠంబుఁ గొఱికి చంపె.

234


వ.

ఇట్లు చంపి యాకుళీరం బెటకేనియుం జనియె నట్లు నీవును గృష్ణసర్పంబు భంజింపు
మని యుపాయంబుం జెప్పినఁ దెలిసి వాయసంబు జంబుకంబు ననిచి నిజనివాసం
బునకుం జనియెఁ దదనంతరంబ.

235


ఉ.

ఆమఱునాడు వాయసము నాపుర మేలుమహీశుమందిరా
రామములోనఁ గ్రుమ్మరఁగ రాజపురంధ్రులు వచ్చి యచ్చటం
గోమలపుష్పమంజరులు గోసి పదంపడి యంబుకేళికిన్
బ్రేమ దలిర్ప డిగ్గుతఱి భీతమృగేషణ యోర్తు నెవ్వడిన్.

236


చ.

తన మెడ హేమసూత్ర మొకదారువునం దగిలించి గ్రక్కునం
జనిన నెఱింగి వాయసము చంచుపుటంబున దాని గ్రుచ్చి యం
గనలు గనుంగొనంగ వడిగాఁ గడు దూరము పోవ కొయ్యనొ
య్యనఁ జన నత్తెఱంగు వసుధాధిపునొద్దకుఁ బాఱి చెప్పుడున్.

237


క.

విని యానరపతి భృత్యులఁ, గనుఁగొని వాయసము గొన్నకంఠాభరణం
బనువుగఁ దెమ్మని పనిచినఁ, జని వారలు వాయసంబుచక్కటి నరుగన్.

238


గీ.

వాయసంబును నెలయించి వారు సూడఁ, గనకసూత్రంబుఁ గొనిపోయి కాలసర్ప
మున్న వల్మీకవివరమం దునిచి తొలఁగ, సరభసంబున నా పుట్టఁ దిరుగువాఱ.

239


గీ.

గడ్డపారలఁ బారల బెడ్డ లొదవ, వెడఁదగుద్దళ్ళ నాపుట్ట విడియఁ ద్రవ్వ
నందు నిద్రించుచున్న కాలాహి కెరలి, తూలి పాఱంగఁ గొందఱఁ దోలితోలి.

240


వ.

కఱచి యెటయేనియం బఱచునమ్మహాహిం బొదివి పోనీక కొందఱు కోదండధరులు
డాసి యేసి కృష్ణసర్పంబును మృతిఁ బొందించి యాకంఠాభరణంబు గైకొని
చనిరి గావున నుపాయంబున సాధింపరాని కార్యంబులు గలవే యని దమనకుఁడు
వెండియు నిట్లనియె.

241