పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంతట నొక్కనాఁడు మందవిషుండు జలపాదశేషం బైనసరోవరంబునఁ గ్రుమ్మరి
మండూకంబులం గానక నా కింక నిచ్చట నిలువం బని లేదు జలపాదభక్షణానంత
రంబునఁ జనియెదంగాక యని యెలుఁగెత్తి పలికిన నప్పలుకు లాకర్ణించి జల
పాదుండు నాకుం గీడు సేయం దలంచితివే యనిన మందవిషుం డిట్లనియె.

341


క.

భూసురశాపము నన్నుం, జేసినదోషంబు నిన్నుఁ జెందినపనికిం
గాసిలఁగ నేల రమ్మని, డాసినజలపాదు రూపడంగ వధించెన్.

342


వ.

వధియించి యాకృష్ణసర్పంబు నిజేచ్ఛం జనియెం గావున నేనును నవ్విధంబున శత్రుల
నాశ్రయించితి నని పలికి వెండియు నిట్లనియె.

343


గీ.

అగ్నిశేషంబు ఋణశేష మహితశేష, మడఁపలేకున్న నవి వృద్ధి యగుడు నేచి
నిర్దహించును బొదలును నిగిడి చెఱచు, పెఱిఁగి నిశ్శేషముగ నడఁగించు టురవు.

344


గీ.

అడవి నిర్దహింప ననలంబు తరుమూల, రక్ష సేయ మొలచుఁ గమ్మఱంగ
నట్లుగాక శత్రు నాబాలవృద్దంబు, మొనసి చంపవలయు మొదలడంగ.

345


వ.

అని విచారించి పగతుగ నిరవశేషంబుగా సంహరించిన భాగ్యవంతుండ వని పలికి
చిరంజీవి యిట్లనియె.

346


సీ.

వ్యసనశీలుఁడు గాక వసుమతీనాథుండు, సకలప్రజానురంజనము వడసి
క్రోధలోభమదాదిగుణముల వర్ణించి, సత్యధర్మక్షమాశాలి యగుచు
మొనసి యాత్మచ్ఛిద్రములు గాననీ కన్య, మానవచ్ఛిద్రము ల్మది నెఱింగి
దేశకాలంబులు దెలిసి సప్తాంగసం, రక్షకుండై పరాక్రమము మెఱసి


గీ.

యాత్మసంరక్ష మఱవ కహర్నిశంబు, ధార్మికుం డని జగ మెల్లఁ దన్నుఁ బొగడ
నిగిడి సత్కీర్తి దిక్కుల నించెనేని, దేవతాంశమువాఁ డని తెలియవలయు.

347


వ.

అని మఱియును.

348


క.

కడిఁదిపగరు గైదువు గొని, పొడిచినయెడ నైన బ్రదుకు బుద్ధిని జెఱుపం
బడినయమిత్రుఁడం మఱి యె, న్నఁడుఁ దా బ్రతుకంగలేక నాశము నొందున్.

349


చ.

అలఘునిశాతహేతి నదరంటఁగఁ దాఁకినవైరి యాహవ
స్థలమున నోర్చుఁ గాని బహుసైన్యములన్ బొలియింపలేఁడు ని
శ్చలనయతత్త్వసాధనము శాత్రవపుత్త్రకళత్రమిత్త్రమం
డలబలశౌర్యవైభవవిడంబములన్ హరియించు గ్రక్కునన్.

350


వ.

అని మఱియును.

351


క.

ఏపని యుద్యోగించిన, నాపని దైవానుకూల మైన ఫలించున్
రూపింపఁగ మానుష మని, చేపట్టి పెనంగెనేని సిద్ధింప దిలన్.

352