పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


ఉ.

భూరితపోవిశేషమున బుద్ధివివేకమునందు శంభుభ
ట్టారకుఁ బోలు మీరలు జడత్వపయోనిధి యైన నాపయిం
గూరిమి గల్లి వచ్చితిరి కొంకక యానతి యిండు దేహమున్
దారములున్ ధనంబులు మొద ల్ననువేడిన వేగనిచ్చెదన్.

195


క.

భావించి యేను జేయం, గావలసిన దెద్ది యనుడుఁ గలకల నగి య
క్కోవిదవరుఁ డి ట్లనియె య, శోవిజితసుధామయూఖు సురరిపుసూనున్.

196


క.

నీ వంతవాఁడ వగుదువు, దేవాంతకవరకుమార దీర్ఘాయువ వై
యీవిశ్వ మేలు వేఁడం, గావచ్చినవాఁడఁ గాను గాంభీర్యనిధీ.

197


వ.

అవక్రనీతిక్రమచక్రవర్తి యగు శుక్రాచార్యుండు నీకడకును బనిచినఁ బని
విన్నవాఁజ నతనివాక్యప్రకారంబు వక్కాణించెద వినుము.

198


సీ.

మీతండ్రిఁ దీండ్రగా మించంగ వలదె యామేటికీటములైన మేదినీజ
నములఁ గారించెనే నముచిమర్దనముఖ్యదిక్పాకులము మద్దించెఁ గాక
చీమలపై దాఁటునే మహాసింహంబు కఱకుటేనుఁగులపై నుఱుకుఁ గాక
ధనము లర్పించి నిన్ గని మని కొలిచెద రన్న మర్త్యులమీఁద నాగ్రహింప
కాహవోత్సాహశక్తి నీ కగ్గలంబు, గలిగి యున్నదియేన నాకంబుమీఁద
నడువు సాళ్వంబుకొక్కెర నడఁచినట్లు, వాసవుని గెల్చి విక్రమోల్లాసి వగుము.

199


వ.

దుర్వారం బగుదూర్వాసుశాపంబు కారణంబుగ నిర్వాణలక్ష్మి పూర్వ
గీర్వాణాయత్తంబు గాఁగలిగి యున్నయది యిట్టియభిసంధి ననుసంధించి
యాసింధుశయనపూర్వజు గర్వంబుసర్వంబును విడిపించి త్రైలోక్యసామ్రాజ్య
సౌభాగ్యంబు ననుభవింపు మని దేవరాతుండు శుక్రవాక్యప్రకారంబుగా
నాన తిచ్చుటయు వల్లె యని యసురవల్లభుం డమరవల్లభుపైఁ జనుపనికి
నుల్లంబు పల్లవింప ధరాపల్లవికసమర్పితనానావిధపదార్థసంపూర్ణభాండాగా
రుం డై నిజరాజధానికి విజయంబు చేసి.

200


క.

భూరిభుజబలమున ర, క్షోరాజ్యం బేలుచుండె శూరశిఖామం
దారసుమకళిక దనుజకు, మారుఁడు మా ఱెందు లేనిమగఁటిమి నిగుడన్.

201


క.

బాహుబలానంతహయా, రోహ......................
మోహన సీమంతిన్యుప, గూహనలీలానితాంత కుశలజయంతా.

202


ఉ.

హావళిచిన్నయోభళధరాధవశేఖరసైన్యపాల నా
నావిధ..................................లాసతే