పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యవ్యయానందమయుఁడై నిజాత్మ యెఱుఁగ
కధివసింపంగ నపుఁ డమ్మహాత్ముఁ దెలిసి
సర్వగుఁడు వాయుదేవుండు సంభ్రమమున
మెల్లమెల్లనె చేర్చె భూమీతలంబు.

219


క.

స్పర్శనుఁడు తత్తనూనం
స్పర్శనమున నతిపవిత్రభావైకపరా
మర్శనమును, దద్వైభవ
దర్శనమును గల్గె ననుచు ధన్యత వెలిఁగెన్.

220


మ.

..................................................................
..................................................................
భజన ప్రత్యుపకారసిద్ది మెఱయన్ క్ష్మాకాంత తద్విష్ణు దా
సజనాగ్రేసరుఁ బూనె దన్మహిమ లెంచన్ నాకు లీక్షింపఁగన్.

221


వ.

అప్పు డద్ధరణీదేవి యిట్లనియె.

222


మ.

[అతిమూఢుం డయి తండ్రి సౌధశిఖరం బందుండి త్రోయింప దుః
స్ధితుఁడౌ నిన్ను] స్పృశింప నిన్ను నొడువన్ సేవింపఁ బూజింప వ
చ్చితి; నిన్నున్, ననుఁ బూను[నట్టి] హరిసాన్నిధ్యంబునన్ నిల్చి నే
ధృతిమై నిన్ను భరింపనోపుదునె యీతేజం[బు సామాన్యమే].

223


వ.

............................................................................. లుగు
ఫలము; త్వాదృశసంస్పర్శన మందుట దేహము గాంచిన ఫలము;
భవాదృశనుతి జిహ్వాఫలమును; మౌనభావగతులు దుర్లభులు;
నది సహ.....................................................................
...................................................................................
నేఁ బవిత్ర నైతి; మున్ను యజ్ఞవరాహసంగంబున నాకు దివ్యశక్తి
గలిగె; నది నా కొకవింతయై యున్నయది; ని న్నంటినఁ బున
రుద్బుద్ధమాయె; నందున సకల లోక ..............................
...................................... యందు నీవంటి పరమభాగవతు
లొండు రెండడుగులు పెట్టినంతనె సామర్థ్యంబు గలదు.

224