పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ప్రతిదినక్లేశమార్జనపాలనముల
నట్లు గావున ధనబాంధవాదిరూప
లక్ష్మి విద్యుచ్చలంబు; చలంబు గాక
యున్న సంసారరుచి బుధుం డొందకున్నె.

100


క.

అది గాన బాహ్యలక్ష్మిన్
మదిఁ దలఁచిన యట్టి దుష్టమతులకు సర్వ
ప్రదుఁడైన శ్రీవిభుండే
మొదలన్ సేవ్యుండు నీతిమూలం బగుచున్.

101


క.

కారుణ్యసాగరం బగు
నారాయణుఁ డిచ్చు నిజజనమనో౽నుసృతిన్
బేరుగ బాహ్యాభ్యంతర
సారతరోదారసకలసంపల్లీలన్.

102


క.

లీలానృష్టజగత్రయు
శ్రీలక్ష్మీనాథు హృదయసేవ్యుఁ గృపావ్యా
లోలు రమాపతిఁ గొలువక
జాలింబడి యొకని గొల్చు జడుఁడు ఘనుండే.

103


క.

అని సుతుఁడు పల్క దితినం
దనుఁ డుద్భటతప్తతైలధారలలో వా
రినిషేకం బొనరించిన
యనూనరోషాగ్ని కన్ను లంటఁగఁ జూచెన్.

104

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని హింసింప భటులం బనుచుట

వ.

చూచి యతిభయంకరులైన నిజకింకరులం బిలిచి వీని నింతింతలుగా
విశసించుండు. ఎట్లు రక్షించునో యని యప్పుడే హరిసంస్తవంబు
చేసినఫలం బనుభవించుం గాక; కాకోలూకకంకగృధ్రంబులకు వీని
మాంసం బాహారంబుగా నొసంగంజేయుఁడు హరిస్తవంబు విడిచె
నేని విడువుండని నియోగించిన.

105