ఆమూఢుండు గోవిందశరణ్యుండైన సుతుని భటులచే నిజాయుశ్శే
షంబునుంబోలెఁ ద్రోయించి, తద్గురుని వక్రంబుగాఁ జూచి పొమ్ము
బొమ్ము లెస్స లెస్స; ఈశిశువు నిట్లనే చేసితి వనిన మహాప్రసాదం
బని నిజగేహంబునకుం జని విష్ణుని విడిచి దైత్యు ననుచరించు
కొనియుండె; నంత నద్దైత్యుం డాబాలకుని గురునియింటనుంచి
యప్పగించిన గురుభక్తిభూషణుండై వాఁ డశేషవిద్యావిశేషంబుతోఁ
గౌమారంబుఁ గాంచె; నాస్తిక్యం బసాధురతియుఁ గౌమారంబున
లోకులకుం గలుగు. ఆ కౌమారంబున బహిర్విరక్తియు నంతరం
గంబున హరిభక్తియుం గలిగి సకలకళల నితఁడు పూర్ణుండు గాక
మున్నె ప్రకాశితానందపదంబైన జ్ఞానచంద్రుండు సమస్తకళలుం
బోషించె. జ్ఞానచంద్రునకు క్షయంబును, రాహు ముఖలయంబును
దోషాన్వితత్త్వంబునుం బ్రాపింపక యెల్లప్పుడు నుదయించి కళంకము
లేక హృతసర్వతావశక్తియై ప్రకాశింప దైతేంద్రభయంబున గురుండు
బోధింపకమున్న బ్రహ్మంబు సాక్షాత్కారం బయ్యె. సహస్రమార్గం
బుల వెలుంగు హరిప్రసాదదీపంబున సకలంబునుం గాంచె. గురూప
దేశంబు మహామతి కేటికి? మూఢమతికిం గాక; నిరామయునకు
నౌషధం బేటికి నుత్కటరోగభావికిం గాక యని విమర్శించి.