Jump to content

పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

సకలవేదప్రవర్తకుఁ డైనయట్టి ప
                       ద్మజుఁ డంతవాఁడ తామనము రాజ
సమునైన యాత్మకల్పమునందుఁ దత్త్వవి
                       పర్యయం బంది ప్రాగ్భణితసాత్త్వి
కప్రకాశితనిజకల్పంబునందు నా
                       త్మోదీరితంబులై యున్న యాగ
మాంతతాత్పర్యభూమ్యంతయుష్మత్పార
                       గోక్తు లుల్లంఘించి యుక్తి తప్పి


తే. గీ.

సాత్త్వికేతరతత్కల్పసమయములను
హరునిఁదనునింద్రముఖ్యుల నాపరాత్మ
యనుచుఁ బలికెఁ బురాణాళి; పరమమూఢు
లైన యన్యులు పలుకుట యరిది యగునె?

17


తే. గీ.

అక్కటా! యేమి సేయుదు రహహ బద్ధు
లైన జీవులు త్రిగుణమాయం గలంగి
తలఁపుదురు పల్కుదురు చేష్టితము లొనర్తు
రప్పుడు గుణానురూపంబులై చెలంగ.

18


తే. గీ.

తతమహాజ్వరదోషసంతప్తులైన
నరులఁబోలె నచిద్బద్ధనరులఁ బరమ
కారుణికుఁడైన ఘనుఁ డనుకంపఁ బ్రోవ
వలయుఁ దనదయ మిక్కిలి వాసి కెక్క.

19


ఆ.

కరుణఁ దనకు నెంత గలిగిన బద్దుండు
బద్ధుఁడైనవాని బంధ ముడుగఁ
జేయలేదు చర్చ సేయు నశక్తుని
కరుణ నిష్ఫలంబు గాదె జగతి.

20


ఆ.

ఆప్తులై పరస్సహస్రుల ముక్తులు
నిత్యులెన్న నిత్యనిర్మలాత్ము
లిద్ధమతులు యతులు హేయప్రతిభటు లి
ట్లెంచ వారిచేత నేమి యగును?

21