Jump to content

పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నీ కగు. అప్రభాతాంకితంబై యంతర్దశమీగర్హితంబై దృశ్యాదృశ్యత
హరిదినంబునుం గూడియున్న నరుఁడు సేయు సుకృతంబు నిష్పలం
బగు. ఇట్టి దశమీప్రాంతంబున నుండి జగంబుల మోహంబు నొందిం
పుచు తాఁ బడినపాటులన్నియు మఱచి మోహిని హర్షించుచుండు.
యముండు తత్పాతకుల శిక్షించుటకుఁ బటాక్షరలిపి పుట్టెడి. అది
దేవదానవులచేత నలంఘ్యం బగు. రవిసంప్రయుక్తదశమీయోగంబు
భువనత్రయంబునఁ బ్రసిద్ధంబు. ఆయోగయుక్తదశమిం బటస్థితయై
దృశ్యాదృశ్యసంజ్ఞ వర్తించునదియై మోహిని యనుభవించుకొని
తత్పటంబునందు లిపి గావింపుచు నిజస్థానంబున నుండునని
యముండు పలికి దేవతలుం దానును నాకలోకంబున కేఁగె. మోహినియు
జగన్మోహినియై దినేశహీనదశమీప్రాంతంబున నుండెనని వసిష్ఠుండు
మాంధాతకు నెఱింగించి మఱియు.

230


సీ.

పాపనాశనము శోభన మీపురాణంబు
                       రుక్మాంగదచరిత్ర రుక్మచేల
భక్తిగమ్యము జగత్‌ప్రాప్యంబు సర్వదుః
                       ఖక్షయకరము విఖ్యాతతరము
సంతతాయుష్యయశస్యప్రశక్యంబు
                       సర్వశత్రువిఘాతశక్తియుతము
శ్రోతవ్యము మహీశసూనులకెల్ల
                       యప్రదం బధికయోగ్యంబు భూమి


తే. 231


వ.

ఈరుక్మాంగదచరిత్రంబు రాజసూయఫలప్రదంబు. ఇది నీ కెఱిం
గించితి ననిన వసిష్ఠునకు మ్రొక్కి పరమానందంబు నొంది మాంధాత
యేకాదశీనిశ్చయం బెఱింగి ద్వాదశీమహోత్సవం బాచరింపుచు
నుండె.

232