రామాయణంమీద పరిశోధనలు చేసిన అనేకమందికీ సీతారాముల పర్ణశాల ఉన్నదని తెలుసునుగాని నారదీయపురాణరూపకంగా బయటపడిన సీతారణ్యం అనే పేరుగల అరణ్యం ఉన్నదన్న సంగతి అసలు తెలియనే తెలియదు.
నరసింహకవి యాదవశైలం అక్కడ విశేషాలు వర్ణించిన సందర్భంలో వివిధతీర్థాలను వర్ణిస్తూ "ఈ నారాయణహ్రదంబునకు దక్షిణంబునఁ గల్యాణతీర్థంబునకు నుత్తరంబునఁ బారాశరతీర్థంబు గలదు. మన్నియోగంబుచే మద్భక్తుండగు పారాశర్యుండు విష్ణుపురాణంబుఁ దత్తటంబున రచియించె" (నార. 87. పు. 501. వ) అని వ్రాసి కల్యాణతీర్థానికి ఉత్తరంలో ఉన్న పారాశరతీర్థంలో పారాశర్యుడు విష్ణుపురాణాన్ని విరచించినట్లు వెల్లడించాడు.
నరసింహకవి రత్నావళీవృత్తాంతాన్ని వర్ణించిన సందర్భంలో వివిధధర్మాలను గురించి వ్రాస్తూ రత్నావళి రాక్షసునితో ఈ క్రిందివిధంగా చెప్పినట్లు పేర్కొన్నాడు.
| పరిణయము లేని కన్యను | |
(నార. 291. పు. 131. ప.)
ఈ సందర్భంలో శాస్త్రాంతరాల ధర్మసూక్ష్మాన్ని చెపుతూ వివాహం కానటువంటి కన్యతో సంభోగం చెయ్యడం పాపమని పేర్కొనడం ద్వారా వివాహితురాలైనస్త్రీతో అతిచరించడం పాపంకాదని చెప్పినట్లవుతున్నది.
విష్ణుచిత్తుని కథకూ దానికి సంబంధించిన యితరగాథలకూ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదాది గ్రంథాల విమర్శనాసంధర్భంలో పెక్కుప్రాచీనమూలగ్రంథా లున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే నారదీయపురాణంలో వర్ణింపబడిన విష్ణుచిత్తుని కథలో విష్ణుచిత్తుడు ప్రహ్లాదుని కంటె పూర్వుడనీ ప్రహ్లాదుడు విష్ణుచిత్తుని దర్శించి ధన్యుడయ్యాడనీ ఈ క్రిందిపద్యంలో పేర్కొనబడడం ద్వారా విష్ణుచిత్తుడు నరసింహావతారానికి పూర్వమే ఉన్నాడని తేటతెల్లం చేసినట్లయింది.
| విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి | |