పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కం.

ముదిసిన మగనిన్ యౌవన
మదవతులైయున్న సతులు మనసిజకేళిన్
గదియని యట్లనె వేదా
స్పదమగు తిథియందు ధర్మసంఘము దొలఁగున్.

(తె. నార. చతుర్థాశ్వాసము. 194,195 పుటలు. 23నుండి 30 ప.)

ఋషయః ఊచుః :-
విస్తరేణ సమాఖ్యాహి విష్ణోరారాధన క్రియాం।
యయాతోషం సమాయాతి ప్రదదాతి సమీహితం॥

లక్ష్మీభర్తా జగన్నాథోహ్య శేషాఘౌఘనాశనః।
కర్మణాకేన సప్రీతో భవేద్యః సచరాచరః॥

సౌతిరువాచ :-
భక్తిగ్రాహ్యో హృషీకేశోనధనైర్ధరణీధర।
భక్త్యా సంపూజితో విష్ణుః ప్రదదాతి మనోరథం॥

తస్మాద్విప్రాః సదాభక్తిః కర్తవ్యాచక్రపాణినః।
జలేనాపి జగన్నాథః పూజితః క్లేశహాభవేత్॥

పరితోషం ప్రజత్యాశు తృషితస్తుజలైర్యథా।
అత్రాపిశౄయతే విప్రా ఆఖ్యానం పాపనాశనం॥

రుక్మాంగదస్య సంవాద మృషిణా గౌతమేనహి।

(సం. నార. ఉత్తరార్థం-తృ. అ. 1వ శ్లో. నుండి 6వ శ్లో. 1 వ పాదంవరకు)

వ.

అనిన విని ఋషులు శ్రీ భగవదారాధనక్రియ విస్తరంబున నెఱింగింపు
మెందున హరి ప్రసన్నుండై సమీహితంబు లిచ్చు ననిన సూతుండు భక్తియే
ప్రధానంబు. భక్తియుక్తుండై జడుండేని భగవంతుం బూజించిన గ్లేశంబు
లణంగు తృష్ణ నొందినవాఁడు జలంబునఁ దృప్తుండైన కరణిఁ బూజించిన
మాత్రనె హరి పరితోషంబు నొందు నిందునకుఁ బాపనాశనం బగు. ఋషి
గౌతమసంవాదంబు నందునైన రుక్మాంగదోపాఖ్యానంబు విన్నవించెద
వినుండు.

(తె. నార. చతుర్థాశ్వాసము-195 పుట. 31వ.)