పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

పరమర్షులు నరసింహుని
చరితము నరసింహహృతవిశంకటదోషాం
తరదోషాంతరవల్లభ
చరితమువలెఁ బొగడరైరి స్వాంతములందున్.

267


వ.

దొరకొని లోకవాదంబులు బలవంతు లాడుకొందురు. యోగీంద్రులకు
వృథాయాసంబులు; వీర లేకర్మంబులు చేసిన సద్గతిఁ గాంచిరి? యజ్ఞం
బులు చెరచి విప్రర్షుల భంజించి మత్తులైన దైత్యులు పరేశునివలన
మృతిం జెంది భవాబ్ధిముక్తు లైరి; ఏ మార్యుల మౌట, ధృతసచ్చరి
త్రుల మౌట, బహిస్థితుల మైతిమి; దైత్యులు విష్ణుసద్గతి నొందిరి;
దురాత్ముండు భృత్యహస్త్యశ్వరధాదులతో నీశ్వరుని పూర్వంబుల
నారాధింపనోపు; నొకానొకభక్తినిరతుండు ప్రహ్లాదునికంటె నధికుం
డని, కృతార్థుం డని తీర్థాంతరంబులకుం జనిరి. ప్రహ్లాదుండు భగవ
దాజ్ఞను రాజ్యంబు సేయుచుఁ దద్రాజ్యభోగతృష్ణ నొందక, జ్ఞానాచ్యు
తాంఘ్రిభక్తి రాజ్యం బనుభవింపుచుండె; నీచరిత్రంబు వినినవారికి
రోగగ్రహదారిద్ర్యతాపంబు లణంగు ననిన విని నైమిశారణ్యమహ
ర్షులు సూతునిం జూచి యిట్లనిరి.

268


శా.

ఆదైతేయుఁడు శౌరిగాఁ దలఁచి యార్యాదిత్యయజ్ఞక్రియా
సాదం బెప్పుడుఁ జేయ నాగమము లాచ్ఛాదించు తచ్చక్రహ
స్తాదేశంబు లటంచు భోజనపిపాసారంభనిద్రావిహా
రాదు ల్సేయుచు నమ్మురాంతకవిరోధార్థంబు మానుం డిలన్.

269


క.

అతిబద్ధమత్సరంబున
నతఁ డుద్ధతిఁ గలలనైన హరి గెల్చి రణ
క్షితిఁ దరమితి ననిఁ హర్షా
న్వితుఁడై యంతఃపురమున నృత్యము లాడున్.

270


తే. గీ.

అతఁడు హాశ్యాంతరములకు హరికథామృ
తంబు వీనులు చొరనిచ్చు తలఁచు నామ
ధేయములు జిహ్వఁ జేర్చు విధేయులైన
భృత్యవర్గంబుఁ దాను నిర్భీకుఁ డగుచు.

271