పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పతికి వార్థి వైచినవారలె విన్నవించిన నతండు విస్మయం బంది మృత్యు
వుంబోలె రావించిన వచ్చి, సభయందు నాసన్నమృత్యుండైనవాని;
నాయుర్జలధివలన దేహపర్యవతారణంబునకుఁ గృతోద్యోగుండై యమ
వీక్షణంబునకు యవనికామాత్రంబైనవాని నీలాంకుమిశ్రమాణిక్య
ద్యుతిచ్ఛన్నుండైనవాని, ధూమాగ్నిశిఖావ్యాప్తుండైనవాని, మలినాంగ
ద్యుతిధ్వాంతచ్ఛాదితాభరణచ్ఛవియైనవాని, విష్ణునిందాజాత
మూర్తాఘగ్రస్యమానలక్ష్మీకుండైనవాని, దంష్ట్రోత్కటఘోరఘోషణ
ఘనచ్చవికుమార్గదర్శయమదూతనిభులైన భటులతోఁ గూడినవాని,
దవస్పృష్టదవనాంతస్థకింశుకారుండైనవానిం జూచి, ఖిన్నుండైన
వాని దూరంబునం బ్రాంజలియై పీఠంబుననుండి క్రుద్ధుండైనవానిం
జూచి తలవంచుకొనిన, దైత్యుండు భర్జించి “మూఢ! మద్వాక్యంబు
విను మింక నిన్ను నెద్దియుం బలుక” నని చంద్రహాసం బంకించి
సభాజనంబు కంపంబు నొంద "హరిని విడిచెదవో! యసిం ద్రెవ్వఁ
జేయుదునో!" యని పల్కు మూర్ఖునిక్రోధంబు చూచి రక్షోగణంబు
నేఁడు ప్రహ్లాదుండు హతుండు నయ్యెడునని పల్కు సమయం
బున హిరణ్యకశిపుండు క్రోధారుణితనేత్రుండై కుమారునిం జూచి
యిట్లనియె.

255


తే. గీ.

"ఎచట వెదకియు నేఁ గాన నిన్నినాళ్లు;
నధికుఁ డంటి, నిరాకారుఁడైనవాని
సర్వగతుఁ డంటి, త్రిభువనస్వామి యంటి,
వెందుఁ జూపెదు హరిఁ జూపు మింక మూర్ఖ!"

256


వ.

అని "స్తంభంబునం జూపు" మని ఖడ్గంబున స్తంభంబుం
దాటించిన.

257

నృసింహావిర్భావము

సీ.

పటపటత్కటుసముద్భటపటుధ్వనివశీ
                       ర్యద్ఘనస్థూణాసభాంతరంబు
చటచటన్నటదుగ్రచటులరంగస్ఫులిం
                       గాచ్ఛాద్యమానగృహాంగణంబు