పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మొఱపెట్టుకొనుచు, నమోఘబిలోత్సాహ
                       సంపద వ్యర్థమై జడతనున్న
యాహిరణ్యకశిపునంఘ్రులఁ బడి "స్వామి!
                       యాత్మేశ్వరుండు ప్రహ్లాదతనువు


తే. గీ.

నందు జీర్ణించిపోయెఁ, గాలాయనంబు
తప్తమై యున్నఁ బడు నీరధారవోలె;
నేమి చిత్రంబొ కాని నేఁ డిమ్మహాత్ము
తనువులోపల పుంగ్రహోదయము దనరె”.

228


వ.

అనిన విని కలంగి నిజకులాంగారంబైన ప్రహ్లాదు నిట గురుగృహం
బున కనిచి తాను నంతఃపురంబు సొచ్చి పరితపింపుచునున్న వృద్ధ
మంత్రులు "తేజోధికుండైన ప్రహ్లాదునిం బ్రార్థించి, ప్రసన్నునిం
జేసికొని, సామ్రాజ్యంబు లనుభవింపు" మన నాసన్నమృత్యుండు
గాన వారిం దర్జించి మఱియు నొకకార్యంబు విచారించి.

229

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని నాగపాశబద్ధునిఁ జేసి సముద్రమునఁ ద్రోయించుట

శా.

రక్షోవీరులచేత నబ్ధినహిరాడ్రజ్జుచ్చటాబంధదు
ర్విక్షేపం బొనరించి వైష్ణవమణిన్ వేగంబె త్రోయించినన్
సాక్షాత్సత్వగుణాంకురం బనఁగ నాచక్రాయుధధ్యానని
ష్ఠాక్షుణ్ణాత్మకుఁడైన యాఘనుని వేడ్కన్ వేలకుం జేర్చినన్.

230


క.

తను లవణాంబుధిఁ ద్రోయుట,
యనిమిషనక్రాదిజలచరానీకంబుల్
మునుమున్నె తొలగిపోవుట,
ఘనుఁ డసురకుమారుఁ డాత్మఁ గానక యుండెన్.

231


వ.

అప్పుడు పన్నగశాయియనుజ్ఞం బన్నగారి బంధనంబులు కబళించె,
నముద్రుండు రత్నంబులు కానుక దెచ్చి సమాధినిష్ఠ నున్న హరిప్రియుని
సేవించి "స్వామీ! నన్నుఁ గటాక్షింపవే యే నదీనుండ; నీవు జనింప
నీరాక్షసకులంబు చంద్రునిచే నంబరంబువోలె విమలం బయ్యె”
ననం గన్నులు విచ్చి చూచిన మ్రొక్కి సముద్రుం డిట్లనియె.

232