పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

అలఘుస్ఫూర్తుల మిమ్ముఁ జక్రధరపూర్వార్చాకృతిశ్రేణులన్
మ.........................................................................
....................................రూపమున శశ్వత్కీర్తిశేషాంశమై
జలజాక్షుండు శిరంబుల న్నిలిపె భాస్వన్మూర్తి న న్నెప్పుడున్.

225


క.

నరలోకంబు కృతార్థతఁ
బరగెన్ నీ యున్నకతనఁ బావన! నిను నే
[భరియించి నీదు చరణా
బ్జరజోలేశంబు సోఁకి పావిత నైతిన్.]

226


వ.

నీవు నరలోకంబున జనించినకతన నంతకలోకంబు హ్రస్వంబు
నొందె; ననంతలోకంబు వృద్ధి నొందె; భవత్కీర్తనాలోకనాధూత
పాతకులైన నరులు హరిలోకం[బునకుఁ బోయి నిన్ను సన్నుతింప
చెన్నుండు నీభక్తితాత్పర్యవిశేషంబు] వినియె; నిట్లు వృద్ధి నొందె
దని చింతించు నీవంటి పరమభాగవతులగుణంబులు పద్మజునకు
నగమ్యంబులు; నే నెఱుంగనేర్తునే? మీప్రభావంబు భాగవ[తశిరోమణు
లకుంగాక నన్యుల]కు గోచరమే! మూర్ఖమూర్ఖుండైన మీతండ్రి
యచింత్యశక్తియైన ని న్నెఱుంగడు. నిన్నుఁ దలంచినయంతనె
యాపదలు దొలంగు.......................................................
.................................................................................
.................................................................................
బయ్యె నంతఁ బ్రహ్లాదుండు దయామృతదృష్టిం జల్లంజేసిన నందఱు
సుఖంబు వహించిరి; శంబరాదులైన దుష్టదైత్యులు లజ్జావనతవదనులై
లేచి చనిరి; యాశంబరుని, దైత్యరాజును నిందింపుచుఁ బురజను
లార్తిం బాసియుండిరి. రాజును శంబరుండు నన్యోన్యదైన్యంబులం
బరితపింపుచు నుండి రంత.

227


సీ.

సంశోషకుండను శఠదైత్యు నొక్కని
                       ననిలరూపంబైన యతనిఁ దలఁచి
ప్రహ్లాదు మడియింపఁ బఱపిన, వాఁడు త
                       త్తనువులో నడఁగఁ, దద్దైత్యుభార్య