పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అప్పుడు.

213


క.

ఘనుఁ డాతఁడు పరదుఃఖము
తనదుఃఖమువలెఁ దలంచి దయఁ బూని మనం
బునఁ గలఁగి దుర్వ్యథాకం
పనతనుఁడై యుండి శాంతభావముతోడన్.

214


క.

మేరుసమదుఃఖకోటు ల
పారంబుగఁ దన్నుఁ బొదువఁ బ్రాజ్ఞుఁడు మది ని
స్సారాన్యదుఃఖలేశము
దూరంబున వినినఁ గనిన దుఃఖించు దయన్.

215


క.

ధరణీసురపరిరక్షా
పరుఁడై ప్రహ్లాదుఁ డార్తబాంధవు, లక్ష్మీ
వరుఁ దలఁచి కావవే యని
శరణాగతుఁ డయ్యెఁ బరమసంతోషమునన్.

216


శా.

నే ని న్నాత్మఁ దలంచు పుణ్యమున నో నీరేజనేత్రా! పురా
తనదుర్మంత్రబలార్దితావనిసురోత్తంసావలిం గావు; మా
త్మనిదేశంబున లోకముల్ సదసదుద్యత్కార్యముల్ సేయఁబూ
నినవా రెన్నిక నట్టిలోకములకున్ నేఁ డున్నవే దోషముల్.

217


వ.

అది గాన ననీశ్వరులైన వీరిం గావుమని ప్రార్థించిన విష్ణుప్రసాదం
బునఁ దద్కృత్తి శాంతి నొందె; నంత బ్రాహ్మణులు దైత్యుకడ కేఁగి
లజ్జావనతవదనులై యున్న రాజు ఖిన్నుండై పుత్రునిం బిలిచి హర్షిం
చినట్లు "ప్రహ్లాదా! నీపు శంబరునికంటెను మాయ లెఱుంగుదువు;
బ్రహ్మబలోజితయైన కృత్తిని గెలిచితివి; బ్రహ్మబలంబునకంటె
మన యాసురబలంబే శ్రేష్ఠం బనిపించితివి; మదాత్మజత్వమాత్రంబున
నీ కెంత బలంబు గల్గె? మదాచారంబున నడచితివేని బలవంతుఁడ వయ్యెద;
నీవైష్ణవశక్తులకు నంతరంబు చూప నీయందు నీమాయ లన్నియుం
బ్రయోగించితి; బ్రాహ్మణు లందఱును వైష్ణవులే కాన శస్త్రసర్పాగ్ని
దిగ్దంతివిషకృత్యాదులచే సహజబలంబు నష్టంబు గాదు. రాక్షసుల
మన్నించు” మనఁ బ్రహ్లాదుండు నగి ప్రాంజలియై “యేల మోహంబు
నొందించెదవు? మహాకులప్రసూతుండవు; శ్రీవిష్ణువు నెఱుంగవే?
మద్భావంబు పరీక్ష సేయ నిట్లు పలికితివి; మీతాత విష్ణు నాభికమలం