పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

విష్ణుతేజోమయుండగు విభునియందు
నగ్నితేజోమయంబైన యాత్రిశూల
మైక్య మందెఁ బరాత్మ జీవాత్మఁ గలసి
వేఱుఁగా దోఁచకున్నట్లు విస్మయముగ.

208


ఆ. వె.

సర్వభోజి విప్రజన్మంబు ధ్యానహీ
నుం డొనర్చు జపము, దండినవ్ర
తమునఁ జదువు వేదతతియునుబోలెఁ ద్రి
శూల మఫల మయ్యె బాలునందు.

209


క.

ప్రకటవివేకజ్ఞానా
ధికుఁడగు ప్రహ్లాదుఁ గృత్తి తెగనేయక యా
ప్రకృతి మహోత్తమపురుషుని
సకలంకుని నెదురలేని యట్లన యుండెన్.

210


సీ.

కేవలవ్యర్థమై కృత్తి శిలాహత
                       శిలవోలె నెగసి రోషించి క్రోధ
సన్నద్ధు లగుచు నాస్థానంబునందుఁ బ్ర
                       యోగంబుఁ జేసిఁ యత్యుగ్రులైన
ద్విజులపై సంగారదీధితుల్ గ్రమ్మంగ
                       హీనదక్షిణయజ్ఞ మెట్ల నట్ల
నపు డధోగతిఁ ద్రోయ, హస్తముల్ శిరమున
                       దాల్చి వస్త్రములు విదల్చుకొనుచు


తే. గీ.

దాడి వార లఖండరోదనముతోడఁ
గేల నసిఁ బూని త్రిప్పుచు బాలకుండు
తానె ఖండించుకొనినచందమునఁ గావ
దిక్కులే కమ్మహాత్ము నుతించి మ్రొక్కి.

211


ఆ. వె.

"మాకు దిక్కు లేదు; మాయపరాధంబు
గాఁచి మమ్ము నిట్టి కరుణ నేలు;
కృత్తి వచ్చె, నుగ్రకృతి యయ్యె; సంతత
కృత్యభిజ్ఞ! నిలుపు సత్యమహిమ.”

212