పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పరలోకమునందు నీఫలము లేదు. పెక్కు లేటికి? భవాంబుధిఁ దరింపఁ
జేయు హరియే పరంబైన పరాయణంబు; శతసహస్రంబుగాఁ బల్కెద;
హరియే పరంబైన పరాయణము; మీరు న న్నస్త్రాదిఘాతంబుల
నొంపక జయించితివనుట విస్మయంబె? అణిమాదిసిద్ధు లీశ్వరస్మృతి
విఘ్నంబులు; విష్ణుసేవియైన జనునకు విముక్తియే సత్ఫలంబు.
తదంతరాయంబు లీసర్వసిద్ధులు నని.

183


సీ.

అపుడు యోగీశ్వరుండైన దయాబ్ధి ప్ర
                       హ్లాదుండు పలికిన నాత్మ నలరి
ధన్యతఁ గనిరి; కొందఱు దితిజేశ్వరు
                       కడకేగి భయమునఁ గంప మొంది
"యధిప నీసుతుఁడు మాకందఱకును దత్త్వ
                       విద్య బోధించెఁ బ్రవీణుఁ డగుచు;
ధ్యానంబు, జ్ఞానంబు, హరిముక్తి యనియెడు
                       వచన మొక్కటియే కేవలము పల్కు;


తే. గీ.

నతని సన్నిధి నుండ నె ట్లగునొ యనుచు
నేగుదెంచితి” మనిన సమిద్ధరోష
చటులధూమ్రాక్షుఁడై నిశాచరవిభుండు
గరము దెప్పించెఁ బాపసంగరముఁ బూని.

184

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని విషప్రయోగాదులచే బాధించుట

క.

సూదకదంబము రమ్మని,
సూదకభోజ్యాదులందు నొనరిచి, సుమన
స్సూధన మని గరళము మధు
సూదనసహితునకును భక్తిశూన్యత నొసఁగెన్.

185


ఆ. వె.

అపుడు వాసుదేవుఁ డతిభక్తి నెప్పటి
యట్ల తన్ను దితిసుతాగ్రయాయి
యాత్మఁ దలఁప గరళము జ్ఞాతదత్త మ
జ్ఞాతజీర్ణమై యెసంగఁజేసె.

186


ఆ. వె.

గరము మ్రింగి నిర్వికారుఁడై యుండు ప్ర
హ్లాదుఁ జూచి దైత్యుఁ డతివికార
మందెఁ; దథ్య మరయ నది తనకే విష
మై తనర్చె నప్పు డద్భుతముగ.

187