| తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను | |
(నార. 171, 172. పు. 120, 121. ప.)
రుక్మాంగదుడు వేటకు వెళ్ళిన సందర్భంలో నరసింహకవి చేసిన వర్ణన పరమాద్భుతంగా నరసింహకవి శబ్దశక్తికి పదప్రయోగనైపుణ్యానికీ బహుముఖమైన లోకానుభవానికి ప్రతీకగా విరాజిల్లుతున్నది. రుక్మాంగదుడు "హరి కరిగిరి గండక కాసరగవయ తరక్షుఋక్ష శల్యకులంగోత్కర భీకర ఘోరవనాంతరములకు" ఉత్కంఠతో వేటకు వెళ్ళగా అనేకమంది చెంచుదొరలు నేల ఈనినట్లుగా రుక్మాంగదుని సమక్షంలో
| పరిపక్వబహువిధఫలశిక్యములతోడ | |
(నార. 218-పు. 143-ప.)
మొక్కి వయారపు మొనలుదీర్చి ఒకానొకవిడ్డూరం వలె ఎంతో వింతగా విశిష్టంగా తమ తమ వేటల నేర్పరితనాన్ని ఉగ్గడిస్తూ విన్నవించారని నరసింహ