| "ఆదిత్యోదయహీనత | |
సూర్యహీనంబగు దశమీప్రాంతం బేకాదశీమిశ్రంబు నాశంబు నొందించిన నుపవాసవ్రతదానజాగరణంబులచే నార్జించిన పుణ్యంబు నీకగు." (నార. 316 పు. 229 ప. 230. వ.) అని ఏకాదశీమిశ్రితమైన దశమినాడు చేసిన ఉపవాసాది అర్చనం ఫలితాలన్నీ ఆ పూజలు చేసినవారికి దక్కవని స్పష్టపరిచాడు.
నారదుడు విష్ణుమాహాత్మ్యంగురించి, అర్చనావిశేషాలనుగురించి, విధానాలగురించి వివరంగా పేర్కొంటూ విష్ణుచిత్తుని కథావివరణసందర్భంలో న్యాసవిద్యామహాత్మ్యం గురించి విశేషంగా వర్ణించాడు. అంగన్యాస కరన్యాసల మించి మాత్రమేకాక భూమ్యాదిగోళాల వివిధ విభిన్న ఆకర్షణశక్తులకు సైతం లోబడక వాటి నతిక్రమించి యెక్కడికైనా పయనించగల హృచ్ఛక్తిని సైతం మించినదిగా వర్ణించబడిన యీ న్యాసవైశిష్ట్యం గురించి శక్తిమత్తత్వాన్ని గురించి మాటల్లో యెంత వర్ణించినా దాని శక్తిని పరిపూర్ణంగా పేర్కొనలేము. న్యాసమాహాత్మ్యం గురించి నరసింహకవి అనేకవిధాలుగా వర్ణించినదానిలో యీ క్రింది పద్యాలను రెండింటినీ చూస్తే న్యాసమాహాత్మ్య మెంతటిదో మనకు తేలిగ్గా అవగాహన మవుతుంది.
| "ఒనర విద్యలకెల్ల నుత్తమోత్తమము లీ | |