పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జయ జయ రఘుకులచక్రీశ తాటకా
         హరణ, విశ్వామిత్రయాగభరణ,
అనఘ, యహల్యాఘహారి, శంకరధను
         ర్భంజన, జానకీప్రాణనాథ,
భార్గవభుజదర్పభంజన, పితృవాక్య
         పాలన, ఖరముఖప్రళయకాల,
సుగ్రీవవరద, యశోనిధి, వాలిమ
         ర్దన, వారిబంధన, దర్పితోగ్ర
కుంభకర్ణాతికాయాది కుటిలదైత్య
వీరసంహార, రావణద్విపమృగేంద్ర,
పుష్పకాన్వితసాంకేతపురినివేశ,
రామ, శైలతనూజాభిరామనామ.

(నార. 54. పు. 301, 302. ప)

నాళీజంఘునికథను వర్ణించిన సందర్భంలో పరాశరునకు దత్తాత్రేయునకు జరిగిన సంభాషణాసందర్భంగా సీతారామలక్ష్మణులు రాజ్యాన్నివిడిచి అడవులకు వెళ్ళిన తరువాత పర్ణశాలను ఉత్తరభారతదేశంలో కళ్యాణతీర్థానికి ఉత్తరంగా ఉన్న పరాశర ఆశ్రమానికి పశ్చిమతీరంలో పంచభాగవతస్థానం ఉన్నదనీ, ఆ పంచభాగవతస్థానానికి సమీపంలో వరాహదేవతాస్థానం ఉన్నదనీ దానికి దక్షిణదిశలో సీతారణ్యం ఉన్నదనీ ఆ సీతారణ్యంలోనే లక్ష్మణుడు పర్ణశాల కట్టాడనీ నరసింహకవి నారదీయ పురాణవిషయంగా ఈ క్రిందిపద్యంలో వర్ణించాడు.

తనదు కల్యాణతీర్థమునకుఁ గించిదు
         త్తరభాగమున మహోదారమగు ప
రాశరాశ్రమ మఘరాశి మాలానల
         మాతీర్థమణి ప్రతీచ్యంతరమునఁ
దగు పంచభాగవతస్థాన మాతీర్థ
         మున కెంచఁ భ్రాగ్భాగమున వరాహ
దేవతాస్థాన మాతీర్థంబు దక్షిణ
         స్థలిని సీతారణ్య మలరు నచట
లక్ష్మణుఁడు గట్టెఁ బర్ణశాలాగృహంబు
రామజనకసుతామనోరమము గాఁగ
స్థానములు నాల్గు నిట్టివి సంభవించె
నట్టి పుణ్యస్థలంబున యతివరేణ్య!

(నార. 153-154 పు. 30. ప)