పుట:ధనాభిరామము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

45


    ధారుణి నెల్ల విద్యలకు ధామ మనం దగుదక్షవాటి యిం
    పారుసుఖోపవాసమని వచ్చితిఁ జెప్పఁగఁ జూచు వేడుకన్.

వ. విను మే నొక్క రాజపుత్రుండ నితండు మదీయమిత్రుం.
    డొకకారణంబున వచ్చితి మిటకు నని తనవృత్తాంతంబుఁ జెప్పి,
    నీవెవ్వరిదానవు నీపే రేమనినఁ దత్కాంతామణి సంతో
    షించి యిట్లనియె. 104

చ. వలచితి వేను మాయలను వారగసేయఁగ నట్టిబా
    సలున్ వడివడిఁజేసితేని యెడసేయరు పల్లవకోటిఁ జేరి య
    గ్గలముగ మానమున్ ధనము గైకొని తక్కుదు రెంతవారికిన్,
    వలువరు పాపపుంజములు వారవధూమణు లేమి చెప్పుదున్.105

గీ. ఒకరివద్దనుండి యొక్కట నొక్కని
    కన్నుసన్నఁ జేసి కడురయమున
    గవయ నొకనిమోహకార్యంబు లొక్కని
    యెడల నిలుపుకొందు రింతు లెల్ల.106

గీ. ఎంత ప్రొద్దైన లంజవారింటి కెల్ల
   ముందు వెల పంపకను బోవరాదు గాన
   తరుణి యీవేళ మాచేత ధనము లేదు
   యిందు జాణల కౌచిత్య మెఱుఁగవలయు. 107 .

వ. అదియునుంగాక కార్యార్థంబుగా వచ్చితి మింతియేగాని
   యిచ్చోటికి వచ్చినవారముం గాము నీవు ప్రియంబుగూర్చి,
   రమ్మనివచించెదవు మదీయప్రకారంబు వినుము భవదీయ
   మందిరంబునకు వచ్చి సుగుణావతిం గలసి సుఖంబున నుండు