పుట:ధనాభిరామము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

35

    శ్చలమతు లైనయాదిమునిసంఘము సంస్తుతి సేయలేరు నా
    యలవియె మిమ్ముఁ జేరికొనియాడమహేశ్వర పార్వతీశ్వరా.55

వ. అని స్తుతియించి యద్దేవుని సమ్ముఖంబు వెడలి యాస్థాన
    మంటపప్రదేశంబున నిలిచి.56

గీ. వరుస నా వేల్పు సేవింప వచ్చియున్న
   చారుతరమూర్తు లప్పురిజలజముఖులు
   సానెరమణుల వీక్షించి సంతసమున
   సరసవిటచిత్తసంచారి శంబరారి.57

ఉ. మానవులెల్ల మెచ్చఁగను మక్కువమీఱగ భీమనాథుతో
    మానుగఁ బెండ్లియాడి బహుమానమునన్ విహరింపుచున్ కళా,
    స్థానములే విశేషగుణదానగుణంబులు మించినట్టి యా
    సానిచకోరలోచనల శంబరవైరట చూచి వెండియున్.58

చ. కలకల నవ్వుమోములును కల్కివిలాసము మొల్కచన్నులున్ ,
    చిలుకలపల్కులన్ గెలిచి చెన్ను వహించిన ముద్దుమాటలున్ ,
    దళతళ మించుటద్దముల చక్కని చొక్కపు కంఠ భాగముల్,
    గలిగి సమ స్తసౌఖ్యములకందువలో యన నొప్పు కామినుల్. 59

శ. నాయకరమణీమణులకు
    నాయకమో యనఁగ దసరి నలి సౌందర్య
    శ్రీయన నభిరామంబై
    తోయజదళనేత్రి మహిమతో విలసిల్లన్.60

చ. మొలక మెఱుంగు జాజి విరిముత్యపుజిల్లి పశిండి బొమ్మరా.
    చిలుకలకొల్కి మోహనవశీకరమంత్రము మించుచొక్కపుం